ప్రస్తుతం టాలీవుడ్ లో వైవిధ్యమైన కథాకథనాల వేట సాగుతోంది. సహజమైన పాత్రలతో కూడిన ఎమోషనల్ డ్రామాస్ ను మన ఆడియన్స్ ఇష్టపడుతుండడంతో.. మన మేకర్స్ అలాంటి వాటిపై దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగా పలువురు దర్శకులు మలయాళ హిట్ మూవీస్ ను రీమేక్ చేసే ప్రయత్నం ప్రారంభించారు. ఈ మధ్య కాలంలో వచ్చిన అలాంటి ఓ మల్లూ మూవీ ‘కప్పేళ’. ఒక టీనేజ్ అమ్మాయి రాంగ్ కాల్ తో పరిచయమైన ఒక ఆటో డ్రైవర్ ను కలవడానికి ఇంట్లో వారికి తెలియకుండా వెళుతుంది. ఆటోడ్రైవర్ ముఖం కూడా చూడని ఆ అమ్మాయికి ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో అత్యంత సహజంగా రూపొందింది సినిమా. ఇందులో అన్నా బెన్, రోషన్ మ్యాథ్యూస్, శ్రీనాథ్ భాసి ముఖ్యపాత్రలు పోషించారు.
ఇప్పుడు ఇదే సినిమాను తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నం ప్రారంభించారు. అందులో ఒక హీరో గా నవీన్ చంద్ర ఎంపికవగా.. మరో హీరోగా విశ్వక్ సేన్ ను సంప్రదిస్తున్నారు మేకర్స్. అయితే ఒరిజినల్ వెర్షన్ లో అన్నాబెన్ పోషించిన పాత్ర కోసం మల్లూ గాళ్ అయిన అనిఖా సురేంద్రను సెలెక్ట్ చేసే ఆలోచనతో ఉన్నారు మేకర్స్. అనిఖా నిన్న మొన్నటి వరకూ మలయాళంలో బాలనటిగా చాలా సినిమాల్లో కనిపించింది. అయితే ఆమెకు హీరోయిన్ గా తెలుగు సినిమాతోనే బ్రేక్ రాబోతోంది. ఇప్పటికే స్ర్కీన్ టెస్ట్ చేసి మేకర్స్ ఓకే చేసినట్టు సమాచారం.
నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా ఉప్పెన హీరోయిన్ కృతీ శెట్టిని అనుకున్నారు. కానీ ఆమె ఏకంగా రూ. 7లక్షలు పారితోషికం డిమాండ్ చేయడంతో నిర్మాతలు అనిఖా సురేంద్రను కథానాయికగా ఖాయం చేసినట్టు తెలుస్తోంది. ఓటీటీలో లాక్ డౌన్ కు ముందు విడుదలై.. మంచి విజయం సాధించిన ‘కప్పేళ’ సినిమా కథాంశం తెలుగు జనానికి కూడా కనెక్ట్ అయ్యే అవకాశాలుండడంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు నిర్మాతలు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. మరి అనిఖా సురేంద్రన్ తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
Must Read ;- బాలయ్య బోయపాటి సినిమాలో మరో మలయాళ బ్యూటీ?