పార్లమెంటు సమావేశాలకు సభ్యుల హాజరు తీరుపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పదిశాతం సభ్యులు సైతం ఉభయ సభలకు హాజరుకావడం లేదన్నారు. ప్రజలు వారిని ఎందుకు చట్ట సభలకు పంపుతున్నారో ఆలోచించుకోవాలని సూచించారు. హైదరాబాద్ బేగంపేట్లోని సెస్ ఆడిటోరియంలో ఉత్తమ పార్లమెంటేరియన్ నూకల నరోత్తమరెడ్డి శతజయంత్యుత్సవాల ప్రారంభ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు… పార్లమెంటు సభ్యుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
నరోత్తమరెడ్డి సేవలు అజరామరం..
నరోత్తమరెడ్డి సేవలు అజరామరమని వెంకయ్య నాయుడు కీర్తించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. సంగీతంలోనూ ఆయనకు ప్రావీణ్యం ఉందని గుర్తు చేశారు. నేటితరం సంస్క్రతి, సంప్రదాయాలను విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుచూపుతో వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు.
Must Read ;- కరోనా టీకా తీసుకున్న మోడీ, వెంకయ్య ..











