జగన్ నూతన క్యాబినెట్ లో ప్రాంతీయ సమతుల్యత లోపించిందా ? మంత్రివర్గ కూర్పు ఒక సామాజిక విప్లవం అనే వైసీపీ ప్రచారంలో నిజమెంత ? కీలకమైన సామాజిక ఆర్గాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం వెనక అసలు కారణం ఏమిటి ? ప్రజలని జగన్ పరిగణిస్తున్న తీరుపై క్షేత్ర స్థాయిలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు ఏం చెబుతున్నాయి ?
ఆంధ్ర ప్రదేశ్ లో నూతన మంత్రివర్గం కొలువు తీరింది.అయితే జగన్ ఏర్పరిచిన కొత్త క్యాబినెట్ కూర్పు ఓ సామాజిక విప్లవం అనేది వైసీపీ చేసుకుంటున్న ప్రచారం. కానీ జగన్ ఏర్పాటు చేసిన మంత్రివర్గ విస్తరణలో సామాజయీక , ప్రాంతీయ సమతుల్యత లోపించాయనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రజలను, వారి మనోభావాలను పరిగణలోకి తీసుకొని జగన్ కేవలం కులాలు, ఓట్లు ప్రాతిపడికనే ఈ పునర్వ్యవస్థీకరణ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి అన్ని కులాల సమ ప్రాధాన్యత అనేది ప్రజాస్వామ్య చరిత్ర లో ఒక రకమైన తీర్పుగా కొనసాగుతోంది.భారత రాజ్యాంగం కూడా సామాజిక న్యాయం అనుసరించాలనే పేర్కొంటోంది. ఈ క్రమంలో రాజ్యాంగం పై ప్రమాణం చేసి గద్దెనెక్కిన పాలకులు ఆ సామాజిక న్యాయాన్ని పాటించి తీరాలి. కానీ జగన్ తీసుకున్న నూతన మంత్రివర్గ నిర్ణయంలో సామాజిక న్యాయం చేసినట్లు ఎక్కడా కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తంఅవుతున్నాయి.
70 శాతం మంత్రి పదవులను బీసీలకు ఇవ్వడం ద్వారా సరికొత్త సామాజిక న్యాయానికి నాంది పాలికాం అనేది వైసీపీ వాదన. అయితే వెనుక బడిన వర్గాలకు ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఎంతుందో, ఇతర వర్గాలను ఉపేక్షించారు అనేభావన రానీయకుండా ఉండాల్సిన బాధ్యత అంతే ఉంది. కానీ జగన్ ఏర్పాటు చేసిన కొత్త మంత్రివర్గ కూర్పు మాత్రం ఆయన ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారనే చర్చ జరుగుతోంది.ముఖ్యంగా ప్రజలని కేవలం ఓట్లు , కులాలు అనే దృక్పధంతోనే జగన్ పరిగణిస్తున్నారనేది కొందరి వాదన.
ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనారిటీలకు క్యాబినెట్ లో అత్యధిక ప్రాధాన్యత కల్పించామని , ఇదొక సామాజిక విప్లవంగా చెప్పుకుంటున్న జగన్.. కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య మొదలైన అనేక కులాలకు తన మంత్రివర్గంలో అసలు ప్రాతినిధ్యమే కల్పించలేదు. ఈ నేపధ్యంలో ఇది ఎక్కడి సామాజిక విప్లవం అనే ప్రశ్నలు ఆయా వర్గాల నుంచి ఉత్పన్నమవుతున్నాయి.
మరోవైపు జగన్ కొత్త క్యాబినెట్ లో ప్రాంతీయ సమతుల్యత లోపించిందనే చర్చ జోరందుకుంది. వాస్తవానికి మంత్రివర్గ కూర్పు వంటి అంశాలలో సామాజిక సమతుల్యతతో పాటు ప్రాంతీయ సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్న ఉత్తారాంధ్ర, రాయలసీమలకు మంత్రివర్గంలో లభించిన బెర్త్ లను, గోదావరి జిల్లాలతో పాటు సర్కారు జిల్లాలకు దక్కిన పదవులను పరిశీలిస్తే జగన్ తన క్యాబినెట్ కూర్పులో ఎక్కడా ప్రాంతీయ సమతుల్యత పాటించలేదనేది సుస్పష్టం అవుతోందనే భావన వ్యక్తమవుతోంది. అదేసమయంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లోని ఏ జిల్లాకి మంత్రివర్గంలో స్థానం కల్పించని వైనం పైనా తీవ్రమైన అసంతృప్తి నెలకొందట.ఆర్భాటంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినా ప్రాతినిధ్యం కల్పించకపోవడం పై అక్కడి ప్రజలనుంచి తీవ్ర అసహనం వ్యక్తంఅవుతోందట.
ఇక బీసీలను చంద్రబాబు ఏమీ చేయలేదని, జగన్ క్యాబినెట్ లో బీసీలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామన్న వైసీపీ చేసుకుంటున్న ప్రచారం కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు మాత్రమే అనే సెటైర్లు వినిపిస్తున్నాయట. ఈ నేపధ్యంలోనే 1999 – 2004 మధ్యన చంద్రబాబు క్యాబినెట్ ఏర్పాటు చేసిన తీరును జగన్ ఒకసారి పరిశీలించాలని విశ్లేషకులు సూచిస్తున్నారట. అప్పటి చంద్రబాబు మంత్రివర్గంలో తన సొంత సామాజిక వర్గానికి 4 మంత్రి పదవులు ఇస్తే, రెడ్డి సామాజిక వర్గానికి మాత్రం 10 పదవులు ఇచ్చారని.. సామాజిక న్యాయం చేసే పద్దతి ఇదంటూ పేర్కొంటున్నారట. సొంత సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు వచ్చే ప్రమాదం ఉన్నప్పటికీ రాజకీయ ప్రాధాన్యతలను గుర్తెరిగి క్యాబినెట్ ఏర్పాటు చేసిన తీరు నాటి చంద్రబాబు క్యాబినెట్ లో స్పష్టంగా కనిపిస్తోందని స్పష్టం చేస్తున్నారట. కానీ నేడు జగన్ ఏర్పాటు చేసిన మంత్రివర్గం ఆ విధంగా లేదని అభిప్రాయపడుతున్నారట.
ఇదిలా ఉంటే జగన్ కేవలం చంద్రబాబు పై ఉన్న కోపాన్ని ఆ సామాజిక వర్గం పై చూపించేటటువంటి కక్ష పూరిత రాజకీయాలకి జగన్ తెర లేపారనే వాదన వినిపిస్తోందట. చంద్రబాబు పై ఉన్న కక్ష, ద్వేషాన్ని చూపించుకోవడానికి ఆయన సామాజిక వర్గాన్ని బలిపీఠం పై నిలబెట్టారు అనేది జగన్ ఏర్పరిచిన క్యాబినెట్ తో సుస్పష్టం అవుతోందని కొందరు చర్చించుకుంటున్నారట. ఈ క్రమంలోనే అమరావతి పై జగన్ కు ఉన్న ద్వేషం ఈ అంశంతో బయటపెట్టిందనే చర్చ కొనసాగుతోందట. సుధీర్గ కాలం పాటు అమరావతిలో జరిగిన ఉద్యమం మీద ఉన్న అక్కసుతోనే జగన్ ఈరోజు ఆ వర్గానికి క్యాబినెట్ లో స్థానం లేకుండా చేయాలని నిర్ణయించుకున్నారని, ఈ మేరకే క్యాబినెట్ లో వారికి ప్రాతినిధ్యం కల్పించలేదని అనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోందట.ఈ నేపధ్యంలోనే ఇది ప్రజాస్వామ్య స్పూర్తికి, ప్రజాస్వామ్య విలువలకి విరుద్ధం అనే భావన పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోందట.
మొత్తం మీద సామాజిక విపప్లవం పేరిట ఏర్పాటు చేసిన జగన్ కొత్త క్యాబినెట్ కూర్పులో డొల్లతనం బయటపడిందని, సరికొత్త సామాజిక న్యాయం దిశగా మంత్రివర్గం ఏర్పడిందన్న వైసీపీ ప్రచారంలో వాస్తవం లేదని విశ్లేషకులు భావిస్తున్నారట.