సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి అభిమానులు అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా లేకపోతే.. ఈపాటికే సెట్స్ పైకి వచ్చేది. అమెరికాలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ… హైదరాబాద్ లోనే ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మహేష్ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండే వైవిధ్యమైన కథతో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం.
ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. హీరోయిన్ ఫైనల్ అయ్యింది కానీ.. విలన్ ఎవరు అనేది మాత్రం ఇంకా తెలియలేదు. పవర్ ఫుల్ గా ఉండే ఈ విలన్ రోల్ కోసం అరవింద స్వామిని పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. థృవ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుని.. స్టైలీష్ విలన్ అనిపించుకున్న అరవింద స్వామిని సెలెక్ట్ చేయనున్నారని టాక్ వినిపించింది కానీ.. ఆతర్వాత ఏమైందో ఏమో కానీ.. మరోకరి కోసం ట్రై చేస్తున్నట్టు తెలిసింది. అరవింద స్వామి తర్వాత కన్నడ స్టార్ సుదీప్ పేరు వినిపించింది.
ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సుదీప్ ఆతర్వాత బాహుబలి, సైరా నరసింహారెడ్డి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారని చెప్పచ్చు. అందుకనే అనుకుంట సుదీప్ ని కూడా పరిశీలించారని తెలిసింది. ఆతర్వాత మరో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర పేరు కూడా వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కఫూర్ పేరు వినిపిస్తోంది. స్టైలీష్ గా.. పవర్ ఫుల్ గా ఉండే ఈ క్యారెక్టర్ కి అనిల్ కఫూర్ అయితే… యాప్ట్ గా ఉంటుంది అంటున్నారు. ప్రస్తుతం అనిల్ కపూర్ తో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.
అతి త్వరలోనే ఈ సినిమాలో విలన్ రోల్ చేసేది ఎవరు అనేది ఫైనల్ చేసి ఎనౌన్స్ చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయనున్న ఈ క్రేజీ మూవీని 2021 ద్వితీయార్ధంలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. మరి… వరుస విజయాలతో దూసుకెళుతున్న మహేష్ ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.
Must Read ;- మహేష్ లిస్ట్ లో మరో స్టార్ డైరెక్టర్.. ఎవరతడు?