మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. మొన్నీమద్యే తిరిగి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. అయితే ఈ షెడ్యూల్ లో చిరంజీవి జాయిన్ అవ్వలేదు. ఆయన లేకుండానే మిగిలిన నటీనటులు ఉన్న సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కొరటాల. అతిత్వరలోనే చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నట్లు సమాచారం. అందుకనే చిరు తన మేకోవర్ ను కూడా మార్చుకున్నారని సమాచారం.
ఇక ఈ చిత్రంలో విలన్ గా చేస్తోంది ఎవరనేది ఇప్పటివరకు బయటకు రాలేదు. ఆమధ్య కాలంలో ఒక బాలీవుడ్ ప్రముఖుడు ఇందులో విలన్ గా చేస్తున్నాడని వార్తలు వినిపించాయి. కాని ఆ వార్తలు ఒట్టి రూమర్స్ మాత్రమే. అయితే ఇప్పుడు ఈ చిత్రంలోని విలన్ గురించి ఒక సరికొత్త వార్త టాలీవుడ్ లో షికారు చేస్తుంది. అదేమిటంటే ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న విలన్ మనకు బాగా తెలిసిన దక్షణాది సీనియర్ హీరో అని, ఆయన ఎవరో కాదు అరవింద్ స్వామి అని ఆ వార్త సారాంశం.
‘ఆచార్య’ లో చిరంజీవిని ఢీకొట్టబోయేది అరవింద్ స్వామి అని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈయన చరణ్ నటించిన ‘దృవ’ సినిమాలో విలన్ గా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది కూడా. చిరంజీవి స్టేచర్ కు అరవింద్ స్వామి అయితే బాగుంటుందని ఆయనను ఓకే చేశారట చిత్ర బృందం. మరి ఈవార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Must Read ;- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మెగాస్టార్ లేటెస్ట్ మేకోవర్