కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్ననేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ నిబంధనలు కఠిన తరం చేస్తోంది. కరోనా నెగిటివ్ రిపోర్టు లేదా రెండు డోసుల టీకా తీసుకున్నట్లు ఆధారం ఉంటేనే అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లను మే2 తేదీన జరిగే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పటికే ఎన్నికల సంఘం విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించింది. ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు కూడ కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లే సమయానికి 48 గంటల ముందుదై ఉండాలి. నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం, తెలంగాణలోని నాగార్జునసాగర్, ఏపీలోని తిరుపతి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 2వ తేదీన జరగనుంది.
Must Read ;- ఎన్నికల అధికారులపై హత్య కేసు నమోదు చేయాలి.. మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు











