వైసీపీ పతనానికి సైనెడ్ సజ్జలే అని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మండిపడుతున్నారు. జగన్ సామాజ్ర్యాన్ని కూల్చేందుకు సజ్జల కార్మికుడిలా మారారని పార్టీలో ఎప్పటి నుంచో వినిపిస్తున్న విమర్శ.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నకొద్ది అధికార వైసీపీలో అలజడి అనివార్యంగా కనిపిస్తోంది. సీట్ల పంపకాలు ఆ పార్టీలో హీటును రాజేస్తోంది. దాదాపు 90 మందికి పైగా సిట్టింగుల మారుస్తామని అధిష్టానం చెప్పడం ఆ పార్టీలో సర్వత్ర ఆగ్రావేశాలు వ్యక్తమవుతు న్నాయి. ఈ నేపధ్యంలో తెలుగుదేశం, జనసేన కూటమి ఎంతో స్ధితప్రజ్ఞతతో ముందుకు సాగుతున్నాయి. ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ.. కేడర్ కు దిశనిర్ధేశం చేయడంతో పాటు నియోజకవర్గాల్లో కలిసొచ్చే అంశాలు.., నేతల చేరికలపై దృష్టిసారిస్తోంది. ఇక వైసీపీ మాత్రం పాతతరం రాజకీయాలు స్వస్తి పిలికి వైసీపీ అంటేనే ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని తెల్చి ఎమ్మెల్యేలకు సంకేతాలను పంపుతోంది.
పార్టీ డిపాజిట్ అంటూ కరెన్సీ కోసం త్రాసు పట్టింది వైసీపీ. అధిక మొత్తంలో కోట్లు కుమ్మరిస్తేనే కొత్తవారికైనా.., సిట్టింగులకైనా టికెట్లు అంటూ భేరం పెట్టింది. రాజకీయమంటేనే వ్యాపారమని.., దోచుకోండి..దాచుకోండి..పంచుకోండి..అంటూ కమర్షియల్ రాజకీయాలకు తెరతీశారు. సీట్లు అమ్మకాల విషయంలో ఈ తెర మాటున జగన్ రెడ్డి దర్శకత్వం వహిస్తుంటే.., తెరముందు కథను సజ్జల నడిపిస్తున్నారని సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దుమ్మెత్తిపోస్తున్నారు. నిన్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సజ్జలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలానే ఆ మొన్న పూతలపట్టు ఎమ్మెల్యే బాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దూమారమే రేపాయి.
శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకు దాదాపు 90 మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఉద్వాసన తప్పదు అన్నట్లు తాడేపల్లి నుంచి ఇప్పటికే సంకేతాలు పంపిస్తున్నారు. జగన్ ను నమ్ముకుని సర్వం ధారపోసి గత దశాబ్ధకాలంగా పార్టీని బతికించకోవాడానికి త్యాగాలు చేస్తే.. చివరికి టికెట్ ఇవ్వకుండా ఈ విధంగా అవమానిస్తారా..? రాజకీయ విలువలు, సిద్ధాంతాలు, విశ్వసనీయత అంటే అర్ధాలు నీకు తెలుసా జగన్..? అంటూ నిలదీస్తున్నారు. కోటాను కోట్లు డబ్బు.., ఆస్తులను సైతం త్యాగం చేసి పార్టీని బతికించుకునేందుకు ఖర్చు చేస్తే.. చివరికి కనీసం అపాయిట్మెంట్ కూడా ఇవ్వకుండా మధ్యలో సజ్జల పెత్తనం చేయడం ఏమిటి..? అని ఎమ్మెల్యేలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ తోపాటు వైసీపీ పతనానికి సజ్జల సైనెడ్ లా మారారని బహిరంగగానే వినిపిస్తున్న విమర్శ.