మానవ బాంబుగా మారి సీఎం జగన్ చంపుతా..
ఈ నెల 16 వ తేదిన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందని రాజాపాలెం పవన్ ఫణి సీఎం జగన్ పై తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. మానవబాంబుగా మారి సీఎం జగన్ ను చంపుతానని ఫణి తన ట్విటర్ ఖాతాలో పోస్టుపై చేసిన దానిపై సీఐడీ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో ప్రైవేటు జాబ్ చేస్తున్న ఫణిని అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కిందా కేసు నమోదు చేసి శనివారం గుంటూరులో జడ్జి ముందు ప్రవేశపెట్టగా.. సీఐడీ పెట్టిన సెక్షన్లపై అభ్యంతరం తెలిపింది. అలానే సీఐడీ కోరిన రిమాండ్ ను తిరస్కరించి, నిందుతుడికి షరతులతో కూడిన బెయిల్ మంజురు చేసింది!
రాజద్రోహం కేసా? ఆధారాలు లేకుండా ఎలా పెడుతారు??
ఏపీ సీఐడీ పోలీసులు అత్యుత్సాహానికి న్యాయస్థానం బ్రేకులు వేసింది. సీఎం జగన్ రెడ్డిపై సీఐడీ ప్రదర్శించిన స్వామి భక్తిని.. జడ్జి ఆక్షేపించారు. పవన్ ఫణిని శుక్రవారం అదుపులోకి తీసుకున్న సీఐడీ.. గుంటూరు 6వ అదనపు కోర్టులో జడ్జి ఎదుట శనివారం హాజరుపరిచారు. నిందుతుడిపై పెట్టిన సెక్షన్లపై జడ్జి అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ ఫణిపై రాజద్రోహంతో పాటు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించినట్లు సెక్షన్లు నమోదు చేసిన సీఐడీని జడ్జి ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా ఇలాంటి సెక్షన్లు పెట్టడంపై జడ్జి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం నిందితుడిని జైలులో ఉంచాలనే ఉద్దేశపూర్వకంగానే సెక్షన్లు పెట్టినట్లు ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. అలానే సీఐడీ కోరిన ఫణి రిమాండ్ ను తిరస్కరించింది న్యాయస్థానం. అంతేకాక సొంత పూచీకత్తుపై ఫణికి బెయిల్ కూడా మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
Must Read:-సీఎం జగన్ రెడ్డి పై సంచలన కామెంట్స్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆనం..!