జగన్ ఢిల్లీ టూర్ ప్లాన్ లీక్ అయింది. 2019-24 మధ్య ఏపీలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసు విచారణ ఫైనల్ స్టేజ్కు చేరింది. ఇప్పటికే ఈ కేసులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సహా పలువురు అధికారులు కటకటాలు లెక్కపెడుతున్నారు. మిథున్ రెడ్డి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక ఈ కేసులో బిగ్బాస్ వంతు వచ్చినట్లేనని ప్రచారం జోరందుకోవడంతో…జగన్ ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
లిక్కర్ స్కామ్లో తనను కూడా అరెస్ట్ చేస్తారన్న జగన్లో భయం మొదలైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చించేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మద్యం స్కామ్లో రివర్స్ స్టోరీ అల్లేందుకు జగన్ మీడియా ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ స్టోరీని హైలెట్ చేసేందుకే జగన్ ఢిల్లీని వేదికగా చేసుకుంటున్నారని సమాచారం. మరోవైపు తనపై కూటమి ప్రభుత్వం రివేంజ్ పాలిటిక్స్ చేస్తుందని జగన్ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. ఈ స్టోరీలో భాగంగానే ఢిల్లీలో నిరసనలకు సైతం జగన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పుడు అన్ని వేళ్లు జగన్వైపే చూపిస్తున్నాయి. దీంతో జగన్ అరెస్టు ఖాయమని తెలుస్తోంది.
జగన్ను అరెస్టు చేసేందుకు బలమైన ఆధారాలను,స్టేట్మెంట్లను రెడీ చేసుకుంటుంది సిట్. ఈ విషయం జగన్ కూడా అర్థమైపోయింది. జగన్ కూడా మానసికంగా అరెస్టుకు సిద్ధమైపోయినట్లుగా సమాచారం. కానీ అరెస్టును కూడా మైలేజ్గా మార్చుకోవాలనే ప్లాన్లో ఉన్నారు జగన్. తనను అరెస్టు చేస్తే అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే సీనియర్ నేతలతో చర్చించారు జగన్. అందుకే అంబటి రాంబాబు, సజ్జల లాంటి నేతలు పదేపదే జగన్ను అరెస్టు చేస్తారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, తన అరెస్టు సైతం ఓ సంచలనంగా ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు జగన్. తద్వారా ప్రజల్లో సానుభూతి సంపాదించాలని జగన్ అనుకుంటున్నారు.











