ఆంధ్ర ప్రదేశ్ లో బూతుల పార్టీ ఏది అని ఎవరినైనా అడిగితే యిట్టె చెప్పేస్తారు వైసీపీ పార్టీ అని. ఎందుకంటె వాళ్ళు నోరు తెరిస్తే చాలు బూత్ పదాలు వరదల పారుతాయి., ఆంధ్రప్రదేశ్లో చిన్న పిల్లవాడు కూడా నోరు మెదపడు. కొడాలి నాని నుండి విజయసాయి రెడ్డి వరకు వాళ్ళ మాటలు వింటే వీళ్ళు నాయకుల, గల్లీ నాయకుల అనిపిస్తుంది. పార్టీలోని చిన్న నాయకుల వరకు, ఈ మూడున్నరేళ్లలో దాదాపు ప్రతిరోజూ ఏపీ రాజకీయాల్లో కొత్త పతనాలను మనం చూస్తున్నాము. ఈ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేత భార్యను కూడా అసెంబ్లీలో అవమానించారు, దూషించారు. మరి జనసేనను రౌడీ సేన పార్టీ అని పిలిచేంత వరకు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రధాన కార్యాలయంపై పట్టపగలు ఎలా దాడి చేశారో కూడా మనం చూశాం, ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు.
ఈ వైసీపీ పరభుత్వం వచ్చాక ప్రజలు భయానికి గురవుతున్నారు, హత్యారాజకీయాలు ఎక్కువైనాయి, దోపిడీలు దొంగతనాలు, అల్లరి మూకలు చెలరేగిపోతున్నారు, ఎవరికీ అడ్డు అదుపులేకుండా పోతుంది. ఈ మధ్యనే సొంత పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాపింగ్ చేస్తే అడిగే నాథుడు లేడు. స్వాగ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇలాంటివి చూసి చూడనట్టు ఉండాలి అని అన్నారు సమాచారం. సీఎం జగన్ మోహన్ రెడ్డి కి డ్రీం ఆంధ్ర ప్రదేశ్ అని ఎం లేదు , ఆయనకీ తెలిసిందల్లా హత్యారాజకీయం, హత్యాంధ్ర ప్రదేశ్ గా మార్చడమే ఆయన ముఖ్య ఉద్దేశ్యం అన్నారు ఉంది వ్యవహార శైలి.
మరో విషయం ఏమిటంటే గత ప్రభుత్వ కాలంలో కేంద్రప్రభుత్వం అమలుచేసిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా విడుదల చేసిన మరుగుదొడ్ల నిర్మాణంలో టీడీపీ ఎమ్మెల్యే స్వామి అవినీతికి పాల్పడ్డారంటూ అశోక్బాబు 8 నెలలుగా ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే రూ.20 కోట్లు అక్రమంగా సంపాదించారని ఒకసారి, కాదు కాదు పది నుంచి పదిహేను కోట్లని మరోసారి చెప్పటం, ఇలా రకరకాల ప్రకటనలు చేశారు. ఈ వ్యవహారం మొత్తం కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని అతిత్వరలో గుట్టురట్టవుతుందని కూడా ప్రకటించారు. నిజానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ అధికారంలో ఉన్నందున దర్యాప్తు చేసి అవినీతిని బహిర్గతం చేయవచ్చు కదా. అవినీతికి పాల్పడి ఉంటే ఎమ్మెల్యే స్వామిపై కానీ, ఆయనకు అండగా ఉంటున్న దామచర్ల కుటుంబీకుల పై కానీ చర్యలు తీసుకోవచ్చు. అవినీతిలో ఎవరు భాగస్వాములనేది తేటతెల్లం కాకపోయినా మొత్తం వ్యవహారాన్ని బట్టబయలుచేసి అందుకు అధికారంలో ఉన్న స్వామిలాంటి వాళ్లే కారణమని చెప్పుకోవచ్చు. అలా చేయకుండా అవినీతి జరిగిందన్న నిందవేసి ఎమ్మెల్యే ఇంటిపై దాడికి దిగేవిధంగా రౌడీ రాజకీయానికి తెరలేపడం వైసీపీ కె చెల్లింది అనేది సగటు మనిషి ఆలోచనా.










