తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత బలవన్మరణాలు తెలంగాణ ఉద్యమానికే అవమానకరమని వైఎస్ షర్మిల అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం చేర్యాలలో వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి వెంకటేశ్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్పై మరోసారి విరుచుకుపడ్డారు. కేసీఆర్.. తమ పిల్లలకే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడని, తెలంగాణలోని పిల్లల ఉద్యోగాల గురించి మరిచాడని మండిపడ్డారు. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు ఉద్యమ లక్ష్యాలకు దరిదాపుల్లో లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ వచ్చి ఏడేళ్లు గడిచినా.. స్వరాష్టం లక్ష్యాలు నెరవేరలేదన్నారు. ఇంకా ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం కళ్లు తెరుస్తుందని కేసీఆర్ ను వైఎస్ షర్మిల నిలదీశారు.