అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అరాచకం చోటు చేసుకుంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న తమవారు ఆక్సిజన్ సకాలంలో అందక చనిపోయారు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత వల్ల కరోనారోగులు చనిపోలేదని జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మృత్యుఘోషపై వైద్యాధికారులు విచారణ చేపట్టారు.
కర్నూలులో మరో ఐదుగురు
కర్నూలు నగరంలోని కే ఎస్ కేర్ ప్రైవేటు ఆసుపత్రిలో అకస్మాత్తుగా ఆక్సిజన్ అయిపోవడంతో ఐదుగురు కరోనా రోగులు చనిపోయారు. సదరు ఆసుపత్రికి కరోనా చికిత్స చేసేందుకు అనుమతి కూడా లేదని డీహెచ్ఎంవో వెల్లడించారు. రోగుల బంధువులు ఆందోళనకు దిగడంతో ఆసుపత్రి యాజమాని పరారీలో ఉన్నాడని తెలుస్తోంది. తాము కోవిడ్ చికిత్స అందించడం లేదని, కేవలం ఐసోలేషన్ మాత్రమే చేశామని ఆసుపత్రి యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది.
Must Read ;- ఆస్పత్రిలో ఆర్తనాదాలు : ఆక్సిజన్ అందక 20 మంది మృతి, ప్రాణాపాయంలో వందల ప్రాణాలు











