సీబీఎస్ఈ లాగానే తెలంగాణలోనూ పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తూ, ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ విషయానికి సంబంధించిన ఫైల్ను ముఖ్యమంత్రి కేసీఆర్కు విద్యాశాఖ మంత్రి పంపగా ఆయన సంతకం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఉన్న 5 లక్షల 35 వేల మంది టెన్త్ విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ తేదీలపై మరికొన్ని రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Must Read ;- సీబీఎస్ఈ : 10వ తరగతి పరీక్షలు రద్దు, 12 వాయిదా











