(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరుతూ కర్ణాటక బోర్డర్ నుండి ఇచ్ఛాపురం బోర్డర్ వరకు సుమారు 2 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్రను విజయవాడ ప్రాంతానికి చెందిన గడ్డం రాము అనే ఉద్యోగి చేపట్టారు. మార్చి14న ప్రారంభించిన రాము సైకిల్ యాత్ర శనివారం విశాఖ చేరుకుంది.
వైజాగ్ స్టీల్ పరిరక్షణ పోరాట కమిటీ శిబిరానికి చేరుకొని తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ రిలే నిరాహారదీక్ష దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ స్టీల్ ఉద్యోగులు కొనసాగిస్తున్న పోరాటానికి మద్దతుగా ఈయాత్ర చేపట్టినట్లు రాము తెలిపారు. యాత్ర దారిలో తనను కలిసిన ప్రజానీకం అంతా వారి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉండడంతో యాత్ర సజావుగా పూర్తి చేయగలుగుతున్నాను అని తెలిపారు.
Also Read : రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి విశాఖ స్టీల్ ప్లాంట్?











