అన్ని పారామీటర్లలో అధోగతికి దిగజారిన రాష్ట్రం
నీతి అయోగ్ సహా అన్ని నివేదికల్లో అదే వెల్లడి
కరోనా కల్లోలం, విభజన నష్టం కన్నా, వైసిపి విధ్వంసాలతో తీవ్రనష్టం
నాలుగేళ్ల జగన్మోహన రెడ్డి పాలనలో ఏపిలో హింసావిధ్వంసాలతో ఆంధ్రప్రదేశ్ 40ఏళ్లు వెనక్కిపోయింది. నీతి అయోగ్ సహా అన్ని నివేదికలే అద్దంపట్టాయి. కరోనా కల్లోలం, విభజన నష్టం కన్నా వైసిపి హింసా విధ్వంసాలతో తీవ్రనష్టం జరిగింది. ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా క్షీణించాయి. అభివృద్ధి అనేది మచ్చుకి కూడా లేకపోగా, లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేశారు. టిడిపి ప్రభుత్వ హయాంలో నాలుగున్నరేళ్ల క్రితం దేశంలో టాప్ 3 ర్యాంకుల్లో ఉన్న ఏపి ఇంతగా దిగజారడం ఆందోళనకరం..అప్పట్లో పొరుగు రాష్ట్రాలతో పోటీపడి అభివృద్ధి, సంక్షేమం ఉండేది, ఇప్పుడా పోటీతత్వం మచ్చుకికూడా లేదనడానికి దిగువ నివేదికలే దృష్టాంతాలు.
కేంద్రం విడుదల చేసిన ‘‘లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్(లీడ్స్)’’ 2021నివేదికలో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానానికి పడిపోయింది. 2018,2019లో 3వ స్థానంలో ఉన్న ఏపి ఏకంగా 6స్థానాలు దిగజారింది. తెలంగాణ 2స్థానాలు దిగజారి 8నుంచి 10వ స్థానానికి చేరింది. లీడ్స్ 2021నివేదిక ప్రకారం గుజరాత్, హరియాణా, పంజాబ్ మొదటి 3స్థానాల్లో నిలిచాయి. రోడ్లు, రైలు ఇతర రవాణా మార్గాలు, నిర్వహణ, నియంత్రణ, సేవలు తదితర 17అంశాలపై ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ సర్వే నివేదిక ఏపిలో రోడ్ల దుస్థితిని, ప్రయాణీకుల పాట్లకు అద్దంపట్టింది.. ఉత్తరప్రదేశ్ 13వ స్థానం నుంచి 6వ స్థానానికి ఎగబాకడం, హర్యానా 6వ స్థానం నుంచి 2వ స్థానానికి చేరడం అక్కడి ప్రభుత్వాలిచ్చిన ప్రాధాన్యతను బైటపెట్టింది..
‘‘గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్ 2022’’ నివేదికలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 12వ స్థానానికి దిగజారడం గమనార్హం. తెలంగాణ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకుతో టాప్ 1గా నిలవడం విశేషం. దేశవ్యాప్తంగా 709జిల్లాలకు ర్యాంకులు ప్రకటించగా తెలంగాణ 31జిల్లాలు టాప్ 50లో ఉండగా, 3జిల్లాలు టాప్ 5లో నిలిచాయి. కేంద్రజలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పారిశుద్యం, తాగునీటి విభాగం నిర్వహించిన సర్వే ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బైటపెట్టింది..టాప్ 50జిల్లాల్లో ఏపికి చెందింది ఒక్కటీ లేక(గుంటూరు 65వ స్థానం)పోవడం దురదృష్టకరం. టిడిపి ప్రభుత్వ హయాంలో 2018లో ఏపీ 5వ స్థానంలో ఉంటే తెలంగాణ 7వ స్థానంలో ఉండేది. అప్పట్లో విజయవాడ, తిరుపతి, విశాఖ వరుసగా 5,6,7 స్థానాల్లో ఉంటే ఇప్పుడవి అధోగతికి దిగజారడం బాధాకరం..2019లో ఏపీ 6వ స్థానంలో ఉండటమే కాకుండా, టాప్ 10నగరాల్లో తిరుపతి 8వ స్థానం కైవసం చేసుకున్న చరిత్ర ఉంటే ఇప్పుడవి ఏటికేడు పతనం కావడం ప్రభుత్వ వైఫల్యమే..
పాఠశాలల్లో మధ్యలోనే బడిమానేసే విద్యార్ధుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళనకరం..డ్రాప్ అవుట్స్ జాతీయ స్థాయిలో 12.61%వుంటే ఆంధ్రప్రదేశ్ లో 16.29%, తెలంగాణలో 13.74% ఉండటం గమనార్హం. ఏపిలో 6,557పాఠశాలల్లో ఒకే టీచర్ ఉన్నారు(ఏకోపాధ్యాయ స్కూల్స్) ఉండటం పాఠశాల విద్యపై పాలకుల అలక్ష్యానికి సాక్ష్యం.
రాష్ట్రంలో ఉన్నత విద్య పూర్తిగా పడకేసింది..విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం ప్రబలింది, బోధనా ప్రమాణాలు అడుగంటాయి..ఎన్ ఐఆర్ ఎఫ్ ఓవరాల్ ర్యాంకుల్లో ఆంధ్రా యూనివర్సిటీ ర్యాంకు 29నుంచి 71కి పడిపోయింది. ఎస్ వీ యూనివర్సిటీకి 100లోపు ర్యాంకే దక్కలేదు(2019లో 72వ ర్యాంకు). 2019లో 16వ స్థానంలో ఉన్న ఏయూ 2022లో 36కు, ఇప్పుడు ఏకంగా 71కి పతనమైంది. విశ్వవిద్యాలయ ర్యాంకుల్లో ఏయూ 16నుంచి 36కు, ఎస్వీ యూనివర్సిటీ 48నుంచి 67కు పడిపోవడానికి పాలకులదే ప్రధాన బాధ్యత.
‘‘జల్ జీవన్ మిషన్’’’ లో తెలంగాణ ఎంతో ముందుంటే, ఆంధ్రప్రదేశ్ వెనుకంజలో ఉండటం మరో వైఫల్యం..‘‘హర్ ఘర్ కి జల్’’ పథకానికి ఏపిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ 18వేల కోట్లు ఖర్చు చేయాల్సివుండగా, రూ 1,650కోట్లు కూడా ఖర్చుచేయలేదంటే ఏ స్థాయిలో తాగునీటి పథకం నిర్లక్ష్యానికి గురైందో తెలుస్తోంది. 18,578గ్రామాలకుగాను 3,544గ్రామాల్లో మాత్రమే (19%) పూర్తి చేశారు. 4ఏళ్లలో రెండున్నర లక్షల కనెక్షన్లు(2.53%) కూడా ఇవ్వలేదంటే ప్రజల దాహార్తి తీర్చేందుకు మనసురాని కర్కోటక పాలకులనేమనాలి..? ఇటువంటి పనితీరు నేపథ్యంలో 2024కల్లా ఏపీలో మొత్తం 64.94లక్షల గృహాలకు వాటర్ కనెక్షన్లు ఇవ్వాలన్న లక్ష్యానికి ఎప్పుడు చేరుకుంటారు..?
ఇక పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంనుంచి 18వ స్థానానికి పడిపోవడం రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు అద్దంపట్టింది..టిడిపి హయాంలో 2018లో 9వ ర్యాంకులో ఉంటే, 2019కల్లా 12వ స్థానానికి, 2020కి 17వ స్థానానికి, 2021కి 18వ ర్యాంకుకి పతనం కావడం జగన్మోహన రెడ్డి ప్రభుత్వం సృష్టించిన కల్లోల పరిస్థితులే కారణం..గుజరాత్ 13వ స్థానంనుంచి 2వ ర్యాంకుకు పెరగడం, కేరళ 3వ ర్యాంకునించి టాప్ ర్యాంకుకు చేరడం, అస్సాం 7వ ర్యాంకునుంచి 3వ స్థానానికి ఎగబాకడం విశేషం. నోరుతెరిస్తే తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడే జగన్ మౌత్ పీస్ టూరిజం మినిస్టర్ రోజా కి డ్యాన్సులపై ఉన్న శ్రద్ధ, నోరుపారేసుకోవడంలో ఉన్న కళ మంత్రిత్వశాఖను చక్కదిద్దడంలో లేదనేదానికీ అధోగతే నిదర్శనం..
నేషనల్ మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ లో 12.31% పేదలతో 20వ స్థానానికి ఏపి దిగజారిందని నీతిఅయోగ్ 2021 నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో 26.38% జనాభా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నా పాలకులకు చీమకుట్టినట్లు లేదు. కేరళ, గోవా, సిక్కిం, తమిళనాడు తక్కువ పేదరికంతో అగ్రస్థానంలో ఉండగా ఏపి అధఃపాతాళానికి పడింది. వైసిపి అధికారంలోకి వచ్చాక ఏపిలో ఏ స్థాయిలో జీవన ప్రమాణాలు పడిపోయామో, విద్యా వైద్యరంగాలెంత దిగజారోయో, పేదరికం ఎంత ప్రబలిందో నీతిఅయోగ్ నివేదికే అద్దంపట్టింది..చంద్రబాబుపై కక్షతో ‘అన్నా కేంటిన్లు’ మూసేయడం, పండగ కానుకలు నిలిపేయడం, చివరికి పిల్లలకు పంపిణీ చేసే చిక్కీలో కూడా రూ 150కోట్ల స్కామ్ లు చేయడమే ఈ దురవస్థకు దారితీసింది..
డిబిటిపై పేటెంట్ తనదేనన్నట్లుగా ఊకదంపుడు ఉపన్యాసాలు దంచే సీఎం జగన్మోహన రెడ్డి ప్రత్యక్ష నగదు బదిలీ పథకం(డిబిటి)లో ఆంధ్రప్రదేశ్ 19వ స్థానంలోకి పడిపోవడంపై ఏమంటారు..? దేశంలో 36రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో హర్యానా, ఉత్తరప్రదేశ్, త్రిపుర మొదటి మూడు స్థానాల్లో, గుజరాత్ 4వ స్థానంలో ఉంటే, దక్షిణాదిన తమిళనాడు 16వ ర్యాంకులో ఉంటే ఏపి అంతకన్నా అధోగతికి(19)పడిపోవడమేనా జగన్మోహన రెడ్డి చెప్పే డిబిటి గొప్పలు..? రూ 2లక్షల 16వేల కోట్లు పేదల ఖాతాల్లో నేరుగా వేశామని చెప్పడం కాదు, అందులో ఎంతెంత వైసిపివాళ్లే మేసేశారో కూడా వెల్లడించే దమ్ముందా..? స్కీముల్లోనూ స్కాములకు పాల్పడ్డారన్న అప్రదిష్ట వైసిపి ప్రభుత్వం మూటగట్టుకుంది. పేదలకు ఇళ్ల స్థలాల పథకంలోనే ప్రతి నియోజకవర్గంలో రూ 100-200కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఈ ఒక్క స్కీములోనే 30లక్షల ఇళ్లపట్టాలేమోగాని, రూ 30వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారనేది విమర్శలపాలైంది.
సుస్ధిర ఆర్ధికాభివృద్ధి లక్ష్యాలలో 13వ స్థానానికి రాష్ట్రం దిగజారడం మరో వైఫల్యం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్ డిఐ)లో 13వ స్థానానికి పతనమైంది..టిడిపి ప్రభుత్వ హయాంలో రెండు, మూడవ స్థానాల్లో ఉన్న ఏపి ఈ 4ఏళ్లలో 13, 19వ స్థానానికి దిగజారింది. చంద్రబాబు హయాంలో దేశంలోనే అతిపెద్ద ఎఫ్ డిఐ కియా కార్ల తయారీ పరిశ్రమ అనంతపురం జిల్లా పెనుగొండలో నెలకొల్పగా, అదే కియా ఆగ్జిలరీ ఇండస్ట్రీస్ ను వాటాల కోసం బెదిరించి, కమీషన్ల కక్కుర్తితో పొరుగు రాష్ట్రాలకు పారిపోయేలా చేశారనేది బహిరంగ రహస్యం..
మానవ వనరుల అభివృద్ధిలో కేరళ నెం 1 స్థానంలో ఉంటే ఏపిని 20వ స్థానానికి పడిపోయేలా చేశారు. కరోనా సృష్టించిన కల్లోలం, విభజన చేసిన నష్టంకన్నా గత 4ఏళ్ల జగన్మోహన రెడ్డి పాలనలో ఏపిలో రెట్టింపు నష్టం జరిగిందనేది కాదనలేని కఠోర వాస్తవం. ఇసుక కృత్రిమ కొరత సృష్టించి, వైసిపి శాండ్ మాఫియా పేట్రేగిపోయి, ప్రతిరోజూ వేలాది లారీల ఇసుక పొరుగు రాష్ట్రాలకు తరలించడం వల్లే స్థానికంగా నిర్మాణరంగం కుదేలైంది..దానిపై ఆధారపడిన 40లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి, వందలాది మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. జగన్ అవినీతి, అసమర్ధ విధానాల వల్లే పేదరికం పెరిగింది, కొనుగోలు శక్తి సన్నగిల్లింది, పొదుపు శక్తి పూర్తిగా క్షీణించింది, సంపద చక్రాన్ని విచ్ఛిన్నం చేశారు.
ఆహార ధాన్యాల ఉత్పత్తిలో టిడిపి హయాంలో పంజాబ్ తర్వాత 2వ స్థానంలో ఉన్న ఏపీని 6వ స్థానానికి దిగజార్చారు. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటలను అమ్ముకునే దారిలేక, గతంలో అమ్మిన ధాన్యానికి ఇంతవరకు చెల్లింపులులేక రైతాంగం అప్పుల్లో మునిగింది. రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానం, రైతుకూలీల ఆత్మహత్యల్లో 2వ స్థానానికి ఏపి చేరడం వైసిపి ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు అద్దం పడుతోంది.
పేదల సంక్షేమ పథకాలు 83రద్దుచేశారు(బీసి 27, ఎస్సీ 29, ఎస్టీ 17, ముస్లిం మైనార్టీ 10 స్కీములు).. కరెంటు ఛార్జీలు 8సార్లు పెంచారు, రూ 57వేల కోట్ల భారం మోపారు. చరిత్రలో లేనంతగా ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఆస్తిపన్ను రెట్టింపుచేశారు, చెత్తపన్ను రూ 750కోట్లు వసూలు చేశారంటే ఏ స్థాయిలో బాదుడే బాదుడు ఉందో తెలుస్తోంది. ధరలు పెంచి, పన్నులేసి 4ఏళ్లలో పేదలపై రూ 2లక్షల కోట్ల భారాలు మోపారు. అన్నా కేంటిన్లు మూసేశారు, పండగ కానుకలు రద్దుచేసి, రేషన్ సరుకుల్లో కోతలుపెట్టి పేదల పొట్టకొట్టారు, చంద్రన్న బీమా ఎత్తేశారు..
ఏపిలో ఇంకా 27.2% పేదరికంలోనే ఉన్నారంటే, కోటి 50లక్షల మంది బిపిఎల్ కిందకే చేరారంటే పేదరికం ఎంత పెరిగిందో..? ప్రతి ఆరుగురు పేదల్లో 5గురు బిసి, ఎస్సీ, ఎస్టీ,ముస్లిం మైనారిటీలే.. పేదల్లో ఆరోవంతు మంది ఎస్టీలే.. అగ్రవర్ణ పేదలతో పోలిస్తే ఎస్టీలలో పేదరికం 3రెట్లు అధికంగా ఉంటే, ఎస్సీ, ఓబిసిలలో 2 రెట్లు అధికమైంది. ఎస్టీలలో ప్రతి రెండోవ్యక్తి, ఎస్సీ, ముస్లింలలో ప్రతి మూడోవ్యక్తి పేదరికంలోనే మగ్గుతున్నారని ప్రభుత్వ నివేదికలే వెల్లడించాయి.
ఉపాధి కల్పనకే కీలకమైన ఐటి రంగంలో జగన్ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది. ఐటి రంగంలో ఏపి వాటా కేవలం 0.2%మాత్రమేనని జాతీయనివేదికలే చెప్పాయి. టిడిపి హయాంలో మొబైల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా ఏపిని మారిస్తే, గత 4ఏళ్లలో కొత్తగా ఒక్క కంపెనీ రాకపోగా, గతంలో వచ్చిన ఫాక్స్ కాన్ ఎక్స్ టెన్సన్ పరిశ్రమలన్నీ తెలంగాణకు తరలిపోయాయి. అమర రాజాను బెదిరించి తెలంగాణకు తరిమేశారు. పెట్టుబడులు అదనంగా రాకపోగా ఉన్నవాటిని కమిషన్ల కక్కుర్తితో తరిమేయడం, అశాంతి-అభద్రత వల్ల మిగతా కంపెనీలు వెళ్లిపోవడం చూశాం..
స్థిర రేటు(కాన్స్టెంట్) గణాంకాల ప్రకారం గత 4ఏళ్లలో ఏపి జిఎస్ డిపి వృద్ధిరేటును -4% (మైనస్ నాలుగు)కు దిగజార్చారు. హార్టీకల్చర్, లైవ్ స్టాక్, ఆక్వా రంగాలు, నిర్మాణ రంగం, తయారీ రంగం, పారిశ్రామిక రంగం, ట్రేడ్ అండ్ రెస్టారెంట్, సేవారంగం మొత్తం అన్నింటినీ తిరోగమనం చేశారు. ప్రతి రంగంలోనూ మైనస్ గ్రోతే..
అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రెండోరాష్ట్రం ఏపి కావడం గమనార్హం. 8.5%తో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరింది. 4ఏళ్లలో మున్నెన్నడూ లేనంతగా జిఎస్ డిపి మైనస్ 1.8%కు దిగజారింది.
ఏపి అప్పులు రూ 12.5లక్షల కోట్లకు చేరాయి (బహిరంగ మార్కెట్ రుణాలు, వేజ్ అండ్ మీన్స్, స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ లు, ఓవర్ డ్రాప్ట్ లు… అన్నీ కలిపి దిగిపోయేనాటికి)..
నాలుగేళ్ల జగన్ పాలనలో సంపద చక్రం ధ్వంసమైంది. ప్రజల కొనుగోలుశక్తి పడిపోయింది, పొదుపుశక్తి పూర్తిగా క్షీణించింది. ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి.
అటు అభివృద్ధి ఆగిపోవడం, ఇటు అవినీతి పెరిగిపోవడం, మరోవైపు ఎటుచూసినా అశాంతి-అభద్రత వల్లే రాష్ట్రానికీ దుస్థితి దాపురించింది..జరిగిన నష్టానికి బాధ్యులెవరనేది జనానికి తెలిసిపోయింది..ఎప్పుడెప్పుడు ఎన్నికలొస్తాయా, రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించే నాయకుడెప్పుడు వస్తాడా, మళ్లీ ఆంధ్రప్రదేశ్ కు పునర్ వైభవం ఎప్పడెప్పుడా అని గంపెడాశతో అన్నివర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు.
హైదరాబాద్ నుంచి ఏపీకి.. రివర్స్ మైగ్రేషన్..! బాబు సర్కార్ సూపర్ ..!
ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్...











