పోలీసుల అత్యుత్సాహం..
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు అరెస్ట్ వ్యవహారంలో ఏపీ వ్యాప్తంగా రాజకీయ వేడిని ఒక్కసారిగా రాజేసింది. కక్ష సాధింపుకు అక్రమ అరెస్ట్ చేసి, ఉద్యోగుల పక్షాన మాట్లాడినందుకే వేదిస్తారా? అంటూ అశోక్ బాబుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు నినదించారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ఖండనలు తెలిపారు. గుంటూరులో అయితే నిరసనలతో అట్టుడికిపోయింది. అశోక్బాబును గురువారం అర్థరాత్రి విజయవాడలో అరెస్ట్ చేసి, గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. సుమారు 17 గంటల పాటు సీఐడీ కష్టడిలో విచారించి, శుక్రవారం రాత్రి విజయవాడ సీఐడీ కోర్టు జడ్జి ముందుకు అశోక్ బాబుకు హాజరుపర్చగా బెయిల్ మంజురు చూశారు. అయితే గుంటూరు లో నిరసన వ్యక్తం చేసిన టీడీపీ నేతలపై కేసులు కట్టారు. నల్లపాడు, నగరంపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో దాదాపు 60 మందిపై కేసులు నమోదు చేశారు.
చర్యలను సహించరు..
జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న చట్ట వ్యతిరేక చర్యలను ప్రజల సహించరని, గట్టిగా బుద్ధి చెబుతారని టీడీపీ హెచ్చరించింది. గుంటూరు సీఐడీ కార్యాలయం వద్దకు వచ్చిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సీఐడీ కార్యాయలం వైపు పోవు రోడ్లును బ్లాక్ చేసి, పెదఎత్తున పోలీసు మోహరించారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు అశోక్ బాబుకు సంఘీభావం తెలిపేందుకు సీఐడీ కార్యాయలం వైపుకు దూసుకొచ్చారు. నేతలను అడ్డుకున్న పోలీసులు, బలవంతంగా వాహనాల్లో ఎక్కించుకుని నల్లపాడు, నగరంపాలెం పోలీస్ స్టేషన్లకు తరలించారు. సుమారు 60 మంది నేతలపై కేసులు రిజిస్ట్రర్ చేశారు. ఇందులో మాజీ మంత్రి దేవినేని ఉమ, మహ్మద్ నసీర్, కోవెలమూడి రవీంద్ర, బుచ్చిరాంప్రసాద్, పిల్లి మాణిక్యరావు, మన్నవ మోహనకృష్ణ, డేగల ప్రభాకర్, చిట్టాబత్తిని చిట్టిబాబు, కనపర్తి శ్రీనివారరావు, మన్నెం శివనాగమల్లేశ్వరరావు, సుఖవాసి శ్రీనివాసరావు, రావిపాటి సాయి, మన్నవ వంశీ, ఎల్లావుల అశోక్, గుడిమెట్ల దయారత్నం తదితరులు ఉన్నారు.











