గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆత్మకూరు గ్రామంలో 40 సంవత్సరాలుగా నివశిస్తున్న పేదల ఇళ్లు కూల్చివేయడం దారుణమని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. మంగళగిరిలో ఎమ్మెల్యేగా తాను గెలిస్తే పేదల ఇళ్లు కూల్చివేస్తారంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఎన్నికల్లో అసత్య ప్రచారం చేసి గెలిచారని నారా లోకేష్ మండిపడ్డారు. వైసీపీ నాయకులు పేదల పట్ల కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ పాపం వారిని వదలదని లోకేష్ వ్యాఖ్యానించారు.
ఓ వైపు కోర్టులో కేసు ఉండగానే..
ఆత్మకూరు గ్రామంలో 4 దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లు కూల్చివేతపై హైకోర్టులో కేసు నడుస్తుండగానే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూల్చివేతలకు రెవెన్యూ అధికారులను పంపారని నారా లోకేష్ విమర్శించారు. రెండేళ్లలో పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి, పేదలు కష్టపడి నిర్మించుకున్న ఇళ్లు కూల్చివేసి విధ్వంసానికి పాల్పడుతున్నాడని లోకేష్ ధ్వజమెత్తారు. పేదల ఇళ్లు కూల్చివేసే అధికారం వీరికి ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. గూడు కోల్పోయిన పేదలకు టీడీపీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. పేదల తరపున పోరాడతామని లోకేష్ స్పష్టం చేశారు.
Must Read ;- కేసులు వెనక్కు తీసుకోకుంటే ఆళ్లపై అట్రాసిటీ కేసులు పెడతాం : మార్టిన్











