ఏపీలోని మంగళగిరి మండలం, ఆత్మకూరు రోడ్డు వెంట ఉన్న ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. మున్సిపల్ అధికారులు భారీ పోలీసు బలగాలతో బలవంతంగా మొహరించి ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. ప్రొక్లెయిన్లు, జేసీబీలతో పేదల ఇళ్లను కూల్చేస్తున్నారు. అయితే ఆత్మకూరులో పేదలు నలభై ఏళ్ళుగా నివాసం ఉంటున్నారు. ఇప్పటికే నివాసితులు కోర్టును ఆశ్రయించారు. సోమవారం ఆ పిటిషన్ కోర్టు ముందుకు రానుంది. అయితే అధికారులు ముందుగానే బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బాధితులు పెద్ద ఎత్తున గుమిగూడి నిరసన తెలుపుతున్నారు. ‘నలభై ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, అధికారులు బలవంతంగా ఇళ్లను ఎందుకు కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు పిటిషన్ రాకముందే అధికారులు ఇళ్లను కూల్చడమేంటీ? అని తమ గోడును వెల్లబోసుకుంటున్నారు.
Must Read ;- టీడీపీ సానుభూతిపరులపై వైసీపీ దాడులు