కరోనా కేసులు పెరిగిపోవడంతో తిరుపతి నగరాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. తిరుపతిలోని ప్రతి డివిజన్లో పదుల సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదు కావడంతో నగరపాలక కమిషనర్ గిరీషా తిరుపతి నగరాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా, ఎస్పీ వెంకటప్పలనాయుడులు వ్యాపార సంఘాలు, ఆటో డ్రైవర్ల యూనియన్ల నాయకులతో సమావేశం నిర్వహించారు. కరోనా కేసులు పెరిగిపోయినా జనం జాగ్రత్తలు పాటించకపోవడంతో ఇక కఠిన నిర్ణయం తప్పదని సమావేశంలో నిర్ణయించారు.
మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు
కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో తిరుపతి నగరంలో మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరవాలని వ్యాపార సంఘాలు నిర్ణయించాయి. వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛంధంగా ముందుకు రావాలని ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. గడచిన రెండు మాసాల్లోనే తిరుపతి నగరంలోనే 9 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా కేసులు ఎక్కువగా వస్తున్న తిరుపతి నగరాన్ని కంటైన్మెంట్ చేస్తున్నట్టు నగరపాలక సంస్థ అధికారులు ప్రకటించారు. కరోనా కేసులు నియంత్రిచడంతో పాటు..వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నట్టు ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ప్రకటించారు.
Must Read ;- బెజవాడ దుర్గగుడిలో కరోనా కల్లోలం











