రాజ్యాంగానికి చరమగీతం పాడి .. రక్త చరిత్రకు తెరతీసి!
ఏపీలో బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ఎప్పుడో చరమగీతం పాడేశారన్నది వాస్తవం. జగన్ రెడ్డి అధికారంలోకివచ్చి నెలరోజులు గడవకు మునిపే జూన్ 25, 2019 ఉండవల్లి కరకట్టపై ఉన్న ప్రజావేదికను కూల్చి ధ్వంస రచనకు తెరతీశారు. నాటి నుంచే నేటి వరకు కూడా కట్టడం మాని కూల్చడంపైనే దృష్టిని కేంద్రీకరించాడు. రాజధాని రైతులు గత రెండేళ్లుగా చేస్తున్న నిరసనలపై కనీస స్పందనలేకపోగా .. రైతులు ఆందోళనలను నొక్కిపట్టడానికి తొక్కరాని అడ్డదారులన్నీ తొక్కాడు. రైతు ఉద్యమంలో మహిళలని కూడా చూడకుండా పోలీస్ పవర్ ను ప్రయోగించి, లాఠీచార్జి చేయించాడు. రాజ్యాంగ హక్కులను తుంగన తొక్కాడు. ఎయిడెడ్ ను కొనసాగించాలి, విలీనం వద్దు అంటూ అనంతపురం ఎస్ఎస్బిఎన్ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు శాంతియుత ఆందోళనకు దిగితే గతంలో ఎన్నడూ లేని విధంగా రక్తాలు కారేలా కొట్టాడు. ఎయిడెడ్ ప్రైవేటు బాట పడితే ఫీజులు పెరిగి, విద్యా భారమౌతోందని పేద, మధ్యతరగతి విద్యార్థులు వాపోతున్నా.. చెవిటి ముఖ్యమంత్రికి వినిపించడంలేదని, కనీసం కనిపించేలానైనా శాంతియుత నిరసనకు దిగారు. విద్యార్థులు చేస్తున్న ఈ శాంతియుత నిరసనలో పోలీసు లాఠీ ఆశాంతిని రేపింది. దొరికినవారిని దొరికినట్లు పైశాచిక విహారం చేసి భావి తరాన్ని చీల్చీ చెండాడి, రక్తాలు కారేలా కొట్టింది. ఈ లాఠీకి .. ఏ రాజ్యాంగం ఆ అధికారాన్ని ఇచ్చిందో? చెప్పాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలపాలు, సంఘవిద్రోహ చర్యలకు పాల్పడుతున్న సమయంలో ముందు డ్యూటీ, తరువాత లాఠీకి పనిచెప్పాలి. అంతేకానీ భావి భారతాన్ని నిరంకుశంగా లాఠీలు విరిగేలా కొట్టి శిక్షిస్తాను అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇది ముమ్మాటికీ జగన్ రెడ్డి చేసిన చారిత్రాత్మక తప్పిదమే. అవునన్నా.. కాదన్నా ఇది ముమ్మాటికి రాజారెడ్డి రాజ్యాంగమేనని తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు ఆక్రోసిస్తున్నాయి. విద్యార్థి సంఘాల చేస్తున్న ఆందోళనలకు మద్దతు తెలిపాయి.
విలీన కుట్రకు బీటలు కొట్టారన్న అక్కసుతోనే పోలీసు దాడులు!
వినాశనానికి విపరీత బుద్ధులని పెద్దలు ఊరకనే చెప్పలేదు. జగన్ రెడ్డి ఖజానా ఖాళీ అయ్యేసరికి మైండ్ దొబ్బుతొంది. రాష్ట్రాన్ని హోల్ సెల్ గా అమ్మెయ్యాలన్న తన ప్రయత్నానికి ఎవరు అడ్డుపడ్డా .. ఆయనలోని ఉన్మాదం బయటకు వచ్చి .. చతురంగ బలగాలను ఆదేశించి విలయం సృష్టిస్తాడని సోషల్ మీడియా వేదికగా ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. విద్యార్థి సంఘాలనే టార్గెట్ చేస్తూ .. ప్రభుత్వ ప్రేరిపిత చర్యను పోలీసులు పక్కగా అమలు చేశారన్నది ఇక్కడ తేటతెల్లం. రాష్ట్రంలోని తొలి దఫా ఎయిడెడ్ డిగ్రీ కళాశాలను విలీనం చేసుకుని నాడు – నేడు కిందా అభివృద్థి చేసి, ఉన్నతంగా తీర్చుతాం అన్నది జగన్ రెడ్డి మాట. అయితే మిమ్మల్ని నమ్మి మా ఆస్తులు మీచేతిలో పెట్టి .. తరతరాల నుంచి ఎంతో అద్భుతంగా నడిపిస్తున్న విద్యాలయాలను తాకట్టుకు దిశగా వెళ్లేందుకు ససేమీర మేం ఒప్పుకొమని కరాఖండిగా చెప్పాయి పలు ఎయిడెడ్ విద్యాసంస్థలు. ఆస్తులను అప్పగించడం ఇష్టంలేకనే 95 శాతం ఎయిడెడ్ విద్యా సంస్థలు జగన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. యాజమాన్యాల నిర్ణయానికి వివిధ పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాలు పూర్తి మద్దతునిచ్చాయి. ఎయిడెడ్ ప్రైవేటికరణ జరిగితే ఫీజులు పదిరెట్లు పెరుగుతాయని, ప్రత్యమ్నాయం చూపి ఎయిడెడ్ ను ప్రైవేటీకరణకు అనుమతించాలని ఎప్పుటినుంచో విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల జీవితాలతో ఆడుకొవద్దని హితవు పలికి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ ఏదో అలజడి సృష్టించి ఉద్యమాన్ని నిరుగారించే ప్రయత్నమే విద్యార్థులపై ఈ లాఠీచార్జి దుశ్చర్య. అయితే విద్యార్థి సంఘాలు తగ్గెదేలే అంటూ జగన్ రెడ్డి విలీన కుట్రలను వందకు వందశాతం బీటలు కొట్టారు. ఇలా ప్రభుత్వ తాకట్టు కుయుక్తులకు విద్యార్థి సంఘాలే అడ్డుపడుతున్నాయన్న నేపంతో కత్తికట్టి, రక్తం వచ్చేలా పోలీసు చర్యలకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు ఆరోపింస్తున్నాయి. చివరికి విద్యార్థులపై పోలీసుల దాష్టీకాన్ని న్యూస్ ను కవర్ చేయడానికి వెళ్లిన మీడియాపై కూడా దాడి చేశారు. విద్యార్థులపై లాఠీచార్జి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది ముమ్మాటికి అహంకార ధోరణికి నిదర్శనమని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అభివర్ణిస్తే .. ఎయిడెడ్ కళాశాలను కొనసాగిస్తామని చెప్పి .. విద్యార్థుల తలలు పగలకొట్టడమేమిటని సీపీఎం మధు ప్రశ్నించాడు.
Must Read ;- ఎయిడెడ్ విద్యకు సమాధి? .. భావ్యం కాదు!











