ప్రముఖ హీరోయిన్ నమిత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. విక్టరీ వెంకటేష్ ‘జెమినీ’ సినిమాతో భైరవి పేరుతో నమిత తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ‘సొంతం’, ‘ఒక రాజు ఒక రాణి’, ‘ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి’, ‘బిర్లా’ మొదలగు చిత్రాలలో నమిత తెలుగు ప్రేక్షకుల మన్ననల్ని పొందింది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అనేక విజయవంతమైన సినిమాలలో నటించారు. 2017లో వీరేంద్ర అనే వ్యక్తిని ప్రేమించి పెళ్ళి చేసుకొని తన వ్యక్తిగత జీవితంలోకి వెళ్లిపోయింది.
మళ్ళీ ఇంతకాలానికి సినిమాలపై ద్రుష్టి పెట్టింది నమిత. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తను ఒక సినిమాను నిర్మించబోతున్నట్లు తెలిపింది. ఇప్పటికే కథ ఓకే అయిందని ఈ సినిమా ద్వారా ఒక నూతన డైరెక్టర్ ను వెండి తెరకు పరిచయం చేస్తున్నాని ఆమె తెలిపింది. ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో తాను నటిస్తానని, హీరోయిన్కు ప్రాధాన్యమిచ్చే కథతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఆమె తెలిపింది. ఈ సినిమాలో తన పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని అంటోంది నమిత.
ఈ సినిమా టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్ను ఈ నెల 26వ తేదీన విడుదల చేయనున్నట్లు నమిత వెల్లడించింది. మంచి కథలు తన దగ్గరకు వస్తే అందులో నటించడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటానని కూడా తెలిపింది. తాను నిర్మిస్తున్న చిత్రం తప్పకుండ విజయం సాధిస్తుందనే నమ్మకం తనకు ఉందని నమిత తెలిపింది. ఈ సినిమాతో తాను సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నానని తెలిపింది. అన్నట్టు ఈ అమ్ముడు రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టింది. మొన్నీమధ్య నమిత భారతీయ జనతా పార్టీలో చేరి యాక్టివ్ గా పనిచేస్తోంది. నమిత నిర్మిస్తోన్న సినిమా ఆమె రీఎంట్రీకి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.