పురాణ పురుషుడు శ్రీరాముడిగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. శ్రీ రామనవమి సందర్భంగా ఈ నెల 30 నుంచి ఆదిపురుష్ ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన సీతగా కృతిసనన్ నటించింది. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిన ఈ మూవీ జూన్ 16 న విడుదల కాబోతోంది.ఈ శ్రీ రామ నవమి నుంచి దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ మొదలు కాబోతున్నాయి. ఈ సందర్బంగా దర్శకుడు ఓమ్ రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ మాతా వైష్ణో దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ 2023 లో మోస్ట్ అవైటెడ్ మూవీ గా నిలిచిన ఆదిపురుష్ లో ప్రభాస్ శ్రీ రాముడిగా, కృతి సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా వారిని పోలిన పాత్రల్లో కనిపించబోతున్న్నారు. హనుమంతుడి పాత్రను సన్నీ సింగ్ పోషించారు. చెడుపై గెలిచిన మంచిని చూపిస్తూ .. ఆధునిక కాలానికి అన్వయించి రాబోతోన్న ఆదిపురుష్ తో ప్రభాస్ మరో భారీ హిట్ కు శ్రీకారం చుట్టబోతున్నాడనే అనాలి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రచార కార్యక్రమాలు ఈ నెల 30 నుంచి భారీ స్థాయిలో ప్రారంభమవుతున్నాయి. ఈ చిత్రాన్ని తో సిరీస్, భూషణ్ కుమార్ అండ్ కృష్ణన్ కుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్ లు యూ.వి క్రియేషన్స్ బ్యానర్ తో కలిసి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.