ఢిల్లీని చలి వణికిస్తున్నది. నవంబర్ నెల ఉష్ణోగ్రతలు 71ఏళ్ల తరువాత తొలిసారి4గా అత్యల్పంగా నమోదు అయ్యాయి. ఈ నవంబరులో నవంబర్ లో ఢిల్లీలో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10.2 డిగ్రీల సెల్సియస్గా నమోదు అయ్యాయి. ఏడు దశాబ్దాల తర్వాత నవంబర్ నెలలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వెల్లడించింది.
1949 సంవత్సరంలో నవంబర్ నెలలో 10.2 డిగ్రీలుగా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1938లో అత్యంత తక్కువగా 9.6 డిగ్రీలు, 1930లో 8.9 డిగ్రీల సరాసరి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గత సంవత్సరం నవంబర్ నెలలో 15డిగ్రీలు, 2018లో 13.4డిగ్రీలు, 2016, 2017లలో 12.8 డిగ్రీలుగా నమోదు అయ్యాయి.
Also Read: కరోనా రోగులకు సేవలందిస్తున్న రోబో











