మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అతి పెద్ద సినిమా ” సైరా నరసింహారెడ్డి ” . తన -151 వ సినిమాగా , ఎందరో ప్రముఖ తారలు – అమితాబ్ బచ్చన్ , సుదీప్ , విజయ్ సేతుపతి , జగపతి బాబు , అనుష్క , నయనతార , తమన్నా లతో జత కలిసి చిరంజీవి ఆ సినిమా చేశారు . పరుచూరి బ్రదర్స్ తో పాటు సత్యానంద్ , సాయి మాధవ్ బుర్ర లాంటి హేమాహేమీలు అయిన రచయితలు పని చేశారు . వారే కాకుండా – సెపరేట్ గా తన రైటింగ్ టీంతో స్క్రిప్ట్ రాసుకున్నని డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ లో కూడా చెప్పారు .
నిజానికి ” సైరా ” సినిమాకి సురేందర్ రెడ్డి ని డైరెక్టర్ అనుకున్నప్పుడు చాలా మంది షాక్ అయ్యారు. రాజమౌళి స్థాయి కి చేరుకుంటాడని అనుకున్నారు కానీ ‘ సైరా ‘ సినిమ హిందీ , తమిళ , కన్నడ , మలయాళ వేషన్లు ఫెయిల్ అయ్యాయి. తెలుగు లో ఓకే అనిపించుకొన్నా – రెవిన్యూ పరంగా చిత్ర నిర్మాత రాంచరణ్ కి నష్టాలు మిగిల్చింది .
” సైరా ” తర్వాత , పాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడు అనుకున్న సురేందర్ రెడ్డి, ప్రభాస్ , అల్లు అర్జున్ లతో చేయడానికి ప్రయతించాడు . కానీ ఫలించలేదు. చివరకి అఖిల్ అక్కినేని తో స్పై థ్రిల్లర్ తీయబోతున్నారు సురేందర్ రెడ్డి. సినిమా అభిమానులు అందరూ విపరీతం గా ప్రేమించే ” ది బోర్న్ ఐడెంటిటీ ” స్టైల్ లో అఖిల్ – సురేందర్ రెడ్డి సినిమా ఉంటుందని ఫిలిం నగర్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నిజానిజాలు సినిమా విడుదల అయితే కానీ తెలియవు . అఖిల్ మార్కెట, బిజినెస్ ని మించి ఖర్చు పెడుతున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి ఆస్థాన రచయిత వక్కంతం వంశి కథ అందిస్తున్నారు .
Also Read: రీమేక్స్ లోనూ చిరంజీవిది ‘మెగా’భాగమే