అక్కినేని నట వారసుడు అఖిల్ మరో సినిమాకి సిద్ధమైపోతున్నాడు. అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ జూన్ 19న విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా తర్వాత అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాని అంగీకరించాడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ మీదికి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హాలీవుడ్ సినిమా ‘ది బర్న్’ అనే సినిమా ఆధారంగా వక్కంతం వంశీ ఈ కథ తయారుచేసినట్టు సమాచారం.
బడ్జెట్ పరంగా కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ సినిమాని నిర్మించడానికి నిర్మాత అనిల్ సుంకర సన్నద్ధమవుతున్నారు. సై థ్రిల్లర్ సబ్జక్టుతో ఈ సినిమా రూపొందబోతోంది. మొదటిసారిగా అఖిల్ పూర్తి స్థాయి మాస్ సినిమా చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్ గా మోడల్ సాక్షి వైద్యను ఎంపిక చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ విడుదలకు ముందే ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Must Read ;- అఖిల్ జోడీగా ఉప్పెన బ్యూటీ











