పూజా హేగ్డే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘రాధేశ్యామ్’, సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘మహర్షి’, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత వీర రాఘవ’, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో ‘అల.. వైకుంఠపురములో’ , అక్కినేని అఖిల్ తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’.. ఇలా స్టార్ హీరోల సరసన వరుసగా నటిస్తోన్న క్రేజీ హీరోయిన్ ఆమె . అఖిల్ తో నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రభాస్ తో నటించిన ‘రాధేశ్యామ్’ జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ అమ్మడుకు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు వస్తున్నాయి.
దీంతో ఆమె కి మరింత క్రేజ్ పెరిగిందని చెప్పచ్చు. అందుకనే పారితోషికం కూడా స్టార్ హీరోలతో సమానంగా అందుకుంటోంది. ఇక అసలు విషయానికి వస్తే.. పూజా హేగ్డే ఓ ఇంటిని కూడా కొనుగోలు చేసిందని సమాచారం. ఇంతకీ ఎక్కడంటే.. ముంబైలోని బాంద్రాలో పూజా ఒక అపార్ట్మెంటులో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ని కొనుగోలు చేసిందని టాక్. దీని ప్రత్యేకత స్కైలైన్ వ్యూ అని తెలుస్తోంది. దీని ఖరీదు దాదాపు రూ.20 కోట్లని సమాచారం. ఇంటీరియర్ డిజైనింగ్ మొత్తం పూజా దగ్గరుండి చేయించుకుందని తెలిసింది.
ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోంది. ఇందులో చరణ్ సరసన నటిస్తోంది. వీరిద్దరి పై ఓ సాంగ్ ను చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం మారేడుమిల్లిలో షూటింగ్ జరుపుకుంటున్న ‘ఆచార్య’ మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్ తదితర హీరోలతో నటిస్తోంది. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ.. కెరీర్ లో దూసుకెళుతుంది పూజా హగ్డే.
Must Read ;- పూజా హెగ్డేతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది మరి!