పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు త్వరలోనే రాబోతోంది. దాని కోసం ఇప్పటినుంచే కసరత్తులు జరుగుతున్నాయి. ప్రభాస్ వైజయంతీ మూవీస్ తో సినిమాకు సంబంధించి ఓ బిగ్ఆప్ డేట్ వచ్చేసింది. ఇందులో బాలీవుడ్ లెజండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రను పోషించబోతున్నారు. ప్రభాస్ హీరోగా ప్రతిష్ఠాత్మక వైజయంతీ మూవీస్ సంస్థ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్న సంగతి తెలిసిందే.
ఆ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ను ట్విట్టర్ ద్వారా వైజయంతీ మూవీస్ ప్రకటించింది. దీని అర్థం ప్రభాస్ తో సాగించబోయే తమ ప్రయాణంలో అమితాబ్ ఓ భాగం కానున్నారనే భావం ఉట్టిపడేలా ట్వీట్ ఇచ్చారు. ప్రభాస్ పుట్టినరోజు ఈ నెల 23వ తేదీ. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చిత్రానికి సీక్వెల్ ఈ సినిమా అని అందరూ అనుకున్నారు. సీక్వెల్ అనే ప్రచారం ఈ చిత్రానికి జరుగుతోంది. ఆ విషయంలో ఇంకా స్పష్టత లేదు.
అమితాబ్ కు హృదయపూర్వక స్వాగతం అంటూ వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది.ప్రభాస్ తో ఇప్పటికే ఓం రౌత్ ఓ ప్రాజెక్టును ప్రకటించేశారు. ముందు ఓం రౌత్ సినిమా, ఆ తర్వాతే ప్రభాస్ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ తో నాగ్ అశ్విన్ చేయబోయే సినిమా ఓ సైన్స్ ఫిక్షన్ కథాంశం. దీనికి లెజండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కూడా కథా సహకారం అందించబోతున్నారు. ఈ సినిమా స్క్రిప్టు మీద భారీ స్థాయిలోనే కసరత్తులు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ఈ చిత్రానికి నిర్మాత. వైజయంతీ మూవీస్ కు ఇది 21వ సినిమా. అమితాబ్ తో కలిసి నటించాలన్నది తన చిరకాల కల అని, అది ఇప్పుడు నెరవేరబోతున్నందుకు ఆనందంగా ఉందని ప్రభాస్ అన్నారు.
Welcoming with a full heart, the pride of a billion Indians. The Amitabh Bachchan. Our journey just got BIG-ger!https://t.co/bmG2GXBODh#NamaskaramBigB @SrBachchan 🙏#Prabhas @deepikapadukone @nagashwin7 @AshwiniDuttCh@SwapnaDuttCh @VyjayanthiFilms
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) October 9, 2020