కరోనా సెకండ్ వేవ్ ఏపీని అతలాకుతలం చేసింది. ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది. సకాలంలో వ్యాక్సిన్ అందక, ఆక్సిజన్ నిల్వలు లేక జనం పిట్టల్లారాలిపోయారు. ఆ సమయంలో ‘నేనున్నా’ అంటూ వచ్చాడు ఓ పెద్దాయన. తన ఆయుర్వేద మందుతో ఎంతోమందిని బతికించాడు. మరెందరికో ఊపిరిపోశాడు. ఆయనే నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య. కరోనా నివారణకు ఆనందయ్య కనిపెట్టిన మందుకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పేరొచ్చింది. స్వయంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం సానుకూలంగా స్పందించాడు. ఫలితంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మందికి ఆనందయ్య మందు అందుతోంది.
వరల్డ్ బుక్ లో చోటు
ప్రభుత్వం ఇబ్బందులు పెట్టినా.. నాయకులు కుట్ర రాజకీయాలు చేసినా ఆనందయ్య మాత్రం మందు తయారీని మాత్రం వీడలేదు. చివరకు ఆనందయ్య మందు పవర్ ను గుర్తించిన ఏపీ ప్రభుత్వం సహకరించడం మొదలుపెట్టింది. దీంతో ఆనందయ్య మందు నిర్విరామంగా తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ జరుగుతోంది. ఆనందయ్య మందుకు ప్రజల్లో వస్తున్న స్పందన చూసి ఇంటర్నేషన్ బ్రాహ్మిన్స్ పార్లమెంట్ (ఐబీసీ) ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. ఆయన సేవలకు గుర్తింపుగా సంస్థ ద్వారా వరల్డ్ బుక్ లో చోటు కల్పించనున్నట్లు ఐబీసీ రాష్ట్ర కార్యదర్శి వెంకట నాగరాజ ప్రసాద్ వెల్లడించారు. త్వరలోనే ఆనందయ్య కు ఆ అవార్డును అందజేయనున్నట్లు ప్రకటించారు.
Must Read ;- అంతా వాళ్లిష్టం.. ఆనందయ్య మందు వారికే సొంతం!