ఆనందయ్య మందుకు అడ్డంకులు తొలగిపోయాయి. కంట్లో వేసే కె మందుకు కూడా హైకోర్టు ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఆనందయ్య తయారు చేసిన మందుల్లో కీలకంగా ఉన్న కె రకం మందు తయారీ, పంపిణీకి అడ్డంకులు తొలగిపోయాయి.దీనిపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. దీంతో ఆనందయ్య తయారు చేసిన నాలుగు రకాల మందుల తయారీ, పంపిణీకి అడ్డంకులు తొలగిపోయినట్టైంది.
ఆనందయ్య మందు ప్యాకెట్లపై వైసీపీ రంగులు
సర్వేపల్లి నియోజకవర్గంలో ఆనందయ్య పంపిణీ చేస్తోన్న మందులపై సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫోటోలతోపాటు, వైసీపీ రంగులను అద్దారు. దీనిపై సర్వేపల్లి ఎమ్మెల్యేను వివరణ అడగ్గా, నా సొంత నిధులతో మందు తయారు చేయించానని చెప్పుకొచ్చారు. ప్రతి రూపాయి నేనే ఖర్చు చేశా, ఏ రంగులైనా వేసుకునే హక్కు మాకుందని ఎమ్మెల్యే ప్రకటించారు. అంటే ప్రభుత్వం తరపు నుంచి ఆనందయ్య మందు తయారీకి ఎలాంటి సహకారం అందడం లేదని తేలిపోయింది.
Must Read ;- ఇక్కడైన తర్వాతే మిగతా జిల్లాలకు.. సర్వేపల్లి నియోజకవర్గంలో ఆనందయ్య మందు పంపిణీ