శనివారం జరిగే రాష్ట్రాల మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న లక్ష్మణ్ను మరో 2-3 రోజులు ఢిల్లీలో ఉండాల్సిందిగా పార్టీ నేతలు ఆదేశించినట్లు తెలిసింది. అలాగే, ఈటల రాజేందర్కు పార్టీ ప్రచార కమిటీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మేనిఫెస్టో కమిటీ సారథ్యం అప్పగిస్తారని చర్చ జరుగుతోంది. కాగా, ఆంధ్రప్రదేశ్లో సోము వీర్రాజు స్థానంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ను బీజేపీ అధ్యక్షుడుగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీలోని పార్టీ వర్గాలు తెలిపాయి. సత్యకుమార్ యాదవ్ అధ్యక్షుడైన వెంటనే ఏపీలో పార్టీకి భారీ ఊపు తెచ్చేందుకు కార్యక్రమాలు చేపడతారని.. వైసీపీ ఎంపీ రఘురామరాజుతో పాటు పలువురు ఇతర పార్టీల నేతలను బీజేపీలో చేర్చుకుంటారని చర్చ జరుగుతోంది. అంతేకాక సత్యకుమార్ యాదవ్ పార్టీ అధ్యక్షుడైతే తెలుగుదేశం-జనసేనతో ఎన్నికల పొత్తు ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటె ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాలో బీజేపీ సీనియర్ల మధ్య వివాదం ముదురుతోంది. బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డికి హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ సీనియర్ల మధ్య వివాదం ముదురుతోంది. జితేందర్ రెడ్డిని ఎందుకు ట్వీట్ చేశారో.. ఆయన ఉద్దేశమేమిటో అడగాలన్నారు. వయస్సు మరియు అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా జరిగితే మాట్లాడకూడదు. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూడాలన్నారు. ఎవరి స్వేచ్చ, గౌరవాన్ని తగ్గించవద్దని ఈటల పేర్కొన్నారు.
తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ట్రీట్మెంట్ అవసరమంటూ తెలంగాణ బీజేపీ నేత జితేందర్ రెడ్డి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. ఒక చిన్న వీడియో ద్వారా జితేందర్ రెడ్డి తెలంగాణ నాయకత్వంపై తన అసంతృప్తిని వ్యక్తం చేయగలిగారు. అసలు ఆ వీడియోలో ఏంటంటే.. ఓ వ్యక్తి నాగలిని ట్రాలీలోకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అది పైకి వెళ్లకపోతే, అతను వారి సీటును తన్నాడు. త్వరలో అది ట్రాలీకి వస్తుంది. తెలంగాణ బీజేపీ నాయకత్వానికి కూడా అదే చికిత్స అవసరమని జితేందర్ రెడ్డి పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ను అమిత్ షా, బీఎల్ సంతోష్, సునీల్ బన్సాల్ వంటి అగ్రనేతలకు ట్యాగ్ చేశారు.
అలాగే ఆంధ్ర ప్రదేశ్లో సోము వీర్రాజు ప్లేసులో కొత్త వ్యక్తి , అలాగే సీఎం జగన్ ని ఢీ కొట్టే దమ్మున్న కాండిడేట్ సత్య కుమార్ యాదవకి ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టే అవకాశం మెండుగా కనిపిస్తోంది. జగన్ వ్యతిరేక వ్యక్తికి ఏపీ బీజేపీ చీఫ్ పదవి కట్టబెట్టాలని బీజేపీ నాయకత్వం ఎప్పటినుండో ఎదురు చూస్తోంది.ఆ సమయం రాణే వచ్చింది, ఎన్నిలకల్ సమయం కూడా దగ్గర పడుతుండటంతో ఇదే సరైన సమయం అని కొత్త అధ్యక్షుడికి దిశా నిర్దేశం చేయాలనీ బీజేపీ అధిష్టానం భావిస్తోంది.











