కడప జిల్లాలో జరుగుతోన్న మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.. 2029 ఎన్నికలలో టీడీపీ స్వీప్ చేయడం ఖాయమని ప్రకటించారు.. 2024 ఎన్నికలలో ఉమ్మడి కడప జిల్లాలోని పది స్థానాలలో ఏడింటిని సొంతం చేసుకున్నామని, 2029లో పదికి పది స్థానాలు సాధించడం ఖాయమని ప్రకటించి తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపారు. బద్వేల్, పులివెందుల, రాజంపేట నియోజకవర్గాలలో మాత్రమే ఫ్యాన్ గాలి వీచింది.. మిగిలిన ఏడు స్థానాలలో సైకిల్ ఫుల్ స్పీడ్తో దూసుకుపోయింది.. గత రెండు దశాబ్దాలలో కడప గడపలో టీడీపీకి ఈ స్థాయిలో విజయం దక్కలేదు.. ఇంతటి ఘనవిజయం కట్టబెట్టిన కడప ప్రజల ముంగిట మహానాడు జరుపుకోవాలని నిర్ణయించింది టీడీపీ.. అందుకే, ఈ మహానాడు తెలుగు తమ్ముళ్లకు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తోంది..
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి బసవ తారక రామారావు జయంతి వేడుకగా ప్రతి ఏటా టీడీపీ మహానాడు నిర్వహిస్తోంది.. పార్టీ ఆవిర్భవించిన 43 ఏళ్ల తర్వాత తొలిసారిగా కడపలో మహానాడుని నిర్వహిస్తోంది తెలుగు దేశం. ఈ మహానాడు టీడీపీకి ఎంతో స్పెషల్.. గతేడాది జరిగిన ఎన్నికలలో టీడీపీ ప్రధాన ప్రత్యర్ధి, వైసీపీకి కేవలం ఏడు శాతం స్థానాలు మాత్రమే దక్కాయి.. మొత్తం 175 స్థానాలలో ఆ పార్టీ 11 నియోజకవర్గాలలో మాత్రమే విజయం సాధించింది.. ఈ 11 స్థానాలలో మూడు ఆ పార్టీ అధినేత జగన్ సొంత జిల్లాలోనివి కావడం విశేషం. 2029 నాటికి ఈ నెంబర్ మరింత పడిపోవడం ఖాయమని అంచనాలు వెలువడుతున్నాయి.
2019 నుండి 24 వరకు టీడీపీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది.. టీడీపీ నేతలని, కార్యకర్తలని, ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ని ముప్పుతిప్పలు పెట్టింది నాటి జగన్ సర్కార్.. పార్టీ ఆర్ధిక మూలాలను సైతం కబళించేలా కేసులు పెట్టారు.. వేధింపు చర్యలు చేపట్టింది.. వీటిని తట్టుకొని నిలబడి, 2024లో అధికారం దక్కించుకుంది టీడీపీ. వాటిని తట్టుకొని నిలబడి తిరుగులేని విజయం దక్కించుకుంది తెలుగు దేశం.. అందుకే, వైనాట్ 175 అని ఫేక్ నినాదంతో ప్రజలను మభ్య పెట్టాలని భావించిన జగన్ని… తగిన బుద్ధి చెప్పారు.. జగన్ తన అడ్డా అని భావించిన కడపలోనూ చారిత్రాత్మక విజయం సాధించిందనే భావనతోనే ఎన్నికల తర్వాత తొలి మహానాడుని కడపలో నిర్వహిస్తున్నారని చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు..
ప్రస్తుతం జగన్ గ్రాఫ్ పడిపోతోంది.. అధికారంలో ఉన్న సమయంలో ఆయన టీమ్ చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.. మద్యం, ఇసుక, మైనింగ్తోపాటు వైసీపీ నేతలు చేయని అక్రమాలు, అవినీతి లేవు.. ఆ నేతలలో చాలా మంది జైళ్ల బాట పడుతున్నారు.. జగన్కి అత్యంత సన్నిహితంగా మెలిగిన పలువురు నాయకులు కేసులో చిక్కుకుంటున్నారు.. ఆ పార్టీ భవిష్యత్తు శూన్యం అనే వాదన వినిపిస్తోంది.. ఈ అంచనాలతోనే కడప గడపలో వచ్చే ఎన్నికలలో టీడీపీ భారీ విజయాన్ని నమోదు చేయనుందని రాజకీయ పరిశీలకులు లెక్కలు కడుతున్నారు.. మరి, ఏం జరుగుతుందో చూడాలి..











