ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. అధికార వైసీపీకి అనుకోని షాక్ తగిలింది. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మామ, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు వైసీపీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా.. త్వరలోనే మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో శత్రుచర్ల రాజీనామా చేయడం వైసీపీకి షాకేనని తెలుస్తోంది.
వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చకే తాను ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శత్రుచర్ల ప్రకటించారు. కార్యకర్తలతో సమావేశం తర్వాత తాను ఏ పార్టీలో చేరేదీ ప్రకటిస్తానని ఆయన తెలిపారు. అయితే ఆయన టీడీపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. అదే జరిగితే వైసీపీకి అది పెద్ద షాకేనని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు పుష్పశ్రీవాణి భర్త పరక్షిత్రాజుతో పాటు జిల్లాకు చెందిన పలువురు నేతలు చంద్రశేఖరరాజును బుజ్జగిస్తున్నారని సమాచారం. చివరగా ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో.. ఏ పార్టీ కండువా కప్పుకుంటారో చూడాలి.
Must Read ;- జమిలీతో వైసీపీ చాప్టర్ క్లోజ్!











