చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కత్తి మహేశ్కు వైసీపీ సర్కారు రూ.17 లక్షలు సాయం చేసింది.
సీఎం రిలీఫ్ పండ్ నుంచి రూ.17 లక్షలు
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేశ్కు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందించింది. గత నెల 26న మహేశ్ వెళుతున్న కారు ముందు వెళుతున్న లారీని వేగంగా ఢీకొన్న ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయమైంది. కళ్లు కూడ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో వైద్య చికిత్సకు గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రూ. 17 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్ కింద అపోలో ఆసుపత్రికి చెల్లించనుంది.. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.