చట్టాలను గౌరవించకుంటే వ్యాపారం ముసుకోవాల్సి వస్తోంది!
భారత చట్టాలను గౌరవించకుంటే వ్యాపారం మూసుకోవాల్సి వస్తోందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఓ రేంజ్ లో ట్విటర్ కు హెచ్చరికలు జారీచేసింది. న్యాయమూర్తులపై అనుచిత పోస్టులు పెట్టిన కేసు విచారణలో భాగంగా న్యాయ స్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. భారత చట్టాలు, న్యాయస్థానాలను గౌరవించకపోతే వ్యాపారం మూసుకోవాల్సి వస్తోందని హెచ్చరించింది. ట్విటర్ పై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. వచ్చే వారం లోపు కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘ట్విటర్ పోస్టులు డిలీట్ చేసినప్పటికీ.. విపిన్ అని టైప్ చేస్తే వేంటనే ఆ పోస్టులు వస్తున్నాయని హైకోర్టు న్యాయవాది అశ్విని కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.’’ వాదనలు విన్న ధర్మాసనం.. ట్విటర్ వద్ద ఉన్న న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టుల మెటీరియల్ ను స్వాధీనం చేసుకోవాల్సి వస్తోందని హెచ్చరించింది. పోలీసులను పంపి స్వాధీనం చేసుకునే ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది. న్యాయమూర్తులపై పోస్టులు పెట్టిన విదేశాల్లో ఉన్న వారిని ఎప్పటిలోగా అరెస్ట్ చేస్తారని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. వచ్చే వారంలో కౌంటర్ వేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
Must Read:- ఏపీలో సెగలు రేపుతున్న జిల్లాల పునర్విభజన! అధికారపార్టీ నేతల్లో తలెత్తిన అభిప్రాయబేధాలు!