దసరా కానుకగా ఆహా ఓటీటీలో విడుదలైన ఎమోషనల్ లవ్ స్టోరీ ‘కలర్ ఫోటో’. వర్ధమాన హాస్యనటుడు సుహాస్ హీరోగా, తెలుగమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది. విమర్శకుల ప్రశంసల్ని కూడా అందుకుంది. నిర్మాతలకు బాగానే లాభాల్ని ఆర్జించి పెట్టింది. మౌత్ టాక్ తో అందరినీ ఆకట్టుకుంటోన్న ఈ సినిమా మేకర్స్ కు ఒక విషయంలో నిరాశను కలిగిస్తోందని తెలుస్తోంది.
కలర్ ఫోటో సినిమాకి వస్తోన్న మౌత్ టాక్ ను బట్టి.. ప్రేక్షకుల ఆదరణను బట్టి చూస్తే.. ఈ సినిమాకి మరింతగా డబ్బులు వచ్చే సత్తాఉందని భావిస్తున్నారు. నిజంగా ఈ సినిమాను ఓటీటీలో కాకుండా.. థియేటర్స్ లో విడుదల చేసి ఉంటే.. మరింత ప్రాఫిట్స్ వచ్చేవని అనుకుంటున్నారట. లాక్ డౌన్ కారణంగా ఓటీటీలో విడుదల చేశారు కాబట్టి.. ఆహా వారి ఒప్పందం ప్రకారం ముందుగానే కొంత లాభం అందుకున్నారు.. దాంతో ఈ సినిమా నుంచి నిర్మాతలకు అదనపు లాభాలేమీ రావన్నది వారి ఫీలింగ్. అయితే నిర్మాతలు పెట్టిన పెట్టుబడి ఈ సినిమా సక్సెస్ తో బాగానే వర్కవుట్ అయిందన్నది ఫిల్మ్ వర్గాల వారి సమాచారం.











