(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు బుధవారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం గోశాలను సందర్శించారు.గత ఏడాది మార్చి నెలలో రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్ హోదా నుంచి అశోక్ గజపతిని అర్ధరాత్రి తొలగించి, సంచైత గజపతిరాజును చైర్పర్సన్గా నియమించింది. అప్పటి నుంచి ఈ వివాదం కోర్టులో ఉంది.చందనోత్సవం వంటి కార్యక్రమాలకు కూడా అశోక్ కుటుంబానికి ఆహ్వానం అందని దయనీయ పరిస్థితి కొనసాగింది.ఆయన కూడా అప్పటి నుంచి ఆలయానికి రాలేదు.సంచైత గజపతిరాజును చైర్ పర్సన్గా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు హైకోర్టు రద్దు చేసింది. తిరిగి అశోక్ గజపతి రాజును చైర్మన్గా నియమిస్తూ కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత, మొదటి సారిగా అశోక్ గజపతి రాజు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
Must Read ;- కక్ష గట్టి ఇష్టారాజ్యంగా వ్వవహరించారు: అశోక్ గజపతి