సంగం డెయిరీ వ్యవహారంలో గత నెల 23న ఏసీబీ అరెస్టు చేసిన ఆ సంస్థ ఛైర్మన్,టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.అయితే 4 వారాల పాటు విజయవాడ కార్పొరేషన్ పరిధిలోనే ఉండాలని ధర్మాసనం ఆదేశించింది.విజయవాడలో ఉండే అడ్రస్ విచారణ అధికారులకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.ధూళిపాళ్లను విచారణకు పిలవానుకుంటే 24 గంటల ముందే నోటీసులు ఇవ్వాలని ధర్మాసనం తీర్పు వెలువరించింది.ధూళిపాళ్ల నరేంద్రతోపాటు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
నేడు లేదంటే రేపు
వ్యక్తిగత పూచీకత్తుతో పాటు,ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని ధూళిపాళ్ల నరేంద్రను హైకోర్టు ఆదేశించింది.కోర్టు నిబంధనలు పూర్తయిన తరవాత ఇవాళ,లేదంటే రేపు ధూళిపాళ్ల విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది.రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండులో ఉండగానే ధూళిపాళ్ల నరేంద్ర కోవిడి బారిన పడ్డారు.అనంతరం విజయవాడ ఆయుష్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన సంగతి తెలిసిందే.అనంతరం రాజమండ్రి జైలుకు తరలించారు.కోర్టుకు తెలియజేయకుండా తరలించడంతో హైకోర్టు సీరియస్ అయింది.దీంతో నరేంద్రను రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
Must Read ;- ఐదు రోజుల కస్టడీకి ధూళిపాళ్ల : కంటతడి పెట్టిన కూతురు











