సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టై రిమాండ్లో ఉన్న తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. ఈ మేరకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి ఆయన్ను విజయవాడ తరలించారు. ఈ నెల 5 వరకు విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతిచ్చింది. అయితే కస్టడిలో ఉన్న ధూళిపాళ్లను చూసి, కుమార్తె కన్నీరు మున్నీరైంది. కారు అద్దం తీయమని పోలీసులను బతిమలాడింది. అయినా పోలీసులు వినిపించుకోకుండా వాహనాన్ని ముందుకు తీసుకెళ్లారు. బోరున విలపిస్తూ తండ్రికి టాటా చెప్పింది. దూళిపాళ్ల అరెస్టు ను ఖండిస్తూ తల్లి ప్రమీలాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్ చేశారని ఆయన అన్నారు. అక్రమాలు జరిగి ఉంటే విచారణ తర్వాత అరెస్ట్ చేయాలని చెప్పారు. తన కొడుకు కూడా చూసుకోనివ్వారా.. అంటూ మండిపడ్డారు.
Must Read ;- సంగం డెయిరీ ప్రభుత్వ స్వాధీనంపై కోర్టుకెక్కిన డైరెక్టర్లు











