ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కి కరోనా కాలం అసలు కలిసి రాలేదు . భారీ ప్రాజెక్ట్స్ ‘ బ్రహ్మాస్త్ర ‘, విజయ్ దేవరకొండ – పూరి జగన్ ” ఫైటర్ ” , షేర్షాహ్ , ‘దోస్తానా-2 , జగ్ జుగ్ జియో’ మొదలైన సినిమాల షూటింగ్ మధ్యలో ఆగిపోయాయి. తన డ్రీం ప్రాజెక్ట్ ‘తఖ్త్’ వాయిదా వేశాడు కరణ్ జోహార్. ఇవి చాలవు అన్నట్లు – సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్యకి కరణ్ జోహార్ చూపిన నేపోటిజమ్ కారణం అని ప్రచారం ఒక మోతాదు లో జరిగింది .
డ్రగ్స్ కేసు లో కూడా కరణ్ జోహార్ ఇచ్చే పార్టీలు గురించి చర్చలు జరిగాయి. కరణ్ జోహార్ కి ఆర్ధిక ఇబ్బందులు మొదలు అయ్యాయని బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యం లో కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ లో వేరే వారిని భాగస్వాములు గా చేసుకుంటున్నారు. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎనర్జీ రిసోర్సెస్, అగ్రి బిజినెస్, రియల్ ఎస్టేట్ మొదలు అయిన వ్యాపారాల్లో దిగ్గజం గా పేరొందిన అదానీ గ్రూప్ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ లో -30 శాతం వాటా తీసుకోబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ డీల్ ఫైనలైజ్ అయితే కరణ్ జోహార్ కష్టాలు ఒక కొలిక్కి వచ్చి, ఆగిపోయిన సినిమాలు మొదలు అవుతాయని భావిస్తున్నారు.