కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఎంతో మంది ప్రజలు వైద్య సదుపాయం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎందరో సెలబ్రిటీస్ కోవిడ్ బాధితులకు ఆర్ధిక సహాయాన్ని, ఆక్సిజన్ సదుపాయాన్ని కల్పిస్తూ.. తమ వంతు తోడ్పాటును అందిస్తున్నారు. ఈ క్రమంలో తమిళ స్టార్ హీరో సూర్య ఫ్యామిలీ కోవిడ్ పై పోరాటానికి భారీగా ఆర్ధిక సహాయం చేసి వార్తల్లో నిలిచారు.
సూర్య, ఆయన తండ్రి శివకుమార్, అతడి తమ్ముడు కార్తి.. తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1కోటి విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా వారి ఆర్థిక సహాయానికి తమిళ సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తున్నాయి. సామాన్య ప్రేక్షకులు, అభిమానులు సైతం వారి సేవల్ని ప్రశంసిస్తున్నారు.