విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కరోనా బారినపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్ని, రెండు రోజుల కిందట సీఈసీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. అయితే నిన్న కరోనా టెస్టులు చేయగా కరోనా పాజిటివ్గా నిర్థరణ అయింది. విజయవాడకు చేరుకున్నఎంపీ కేశినేని నాని ప్రస్తుతం ఇంట్లో క్వారంటైన్లో ఉన్నారు. ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు ప్రకటించారు.
మరో ముగ్గురు ఎంపీల్లో ఆందోళన
ఢిల్లీలో రెండు రోజుల పాటు టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు సీఈసీని కలిసే పనిలో తిరిగారు. అందులో ఒకరు కేశినేని నానికి కరోనా పాజిటివ్ నిర్థరణ కావడంతో మిగిలిన వారు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటం, తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో టీడీపీకి చెందిన చాలా మంది నాయకులు కరోనా భారినపడ్డారు. ఇక కేశినేనితో ప్రచారంలో పాల్గొనడంతోపాటు, డిల్లీ వెళ్లిన ఎంపీలు కూడా కరోనా టెస్టులు చేయించుకుంటున్నారని తెలుస్తోంది.
Must Read ;- ఎమ్మెల్యే శ్రీదేవికి కరోనా పాజిటివ్











