వెయిట్ లిఫ్టింగ్ అనగానే చాలామందికి గుర్తుకువచ్చే పేరు కరణం మల్లేశ్వరి. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈమె.. వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ గా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో పతకాలు సాధించి దేశానికి పేరు తెచ్చుకొచ్చారు. 2000 లో సిడ్నీలో జరిగిన పోటీల్లో మొదటి ఒలింపిక్ మెడల్ ని సాధించి దేశ ఖ్యాతిని పెంచారు. అందుకే ఆమెకు పద్మశ్రీ, అర్జున లాంటి అవార్డులు వరించాయి. తాజాగా ఆమెకు మరో గొప్ప అవకాశం లభించింది. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ గా, ప్రభుత్వం నియమించడంతో వార్తల్లోకి ఎక్కారు.
దేశానికి మరింత పేరు తేవాలి
ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్ గా మల్లీశ్వరి నియమితులు కావడం పట్ల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘వైస్ ఛాన్సెలర్ గా మీ నియామక వార్త తెలియగానే… 2000 సిడ్నీ ఒలింపిక్స్ లో మీ చారిత్రక విజయం, ఒలింపిక్స్ పతకం సాధించిన మొట్టమొదటి భారత మహిళగా మిమ్మల్ని తెలుగువారంతా సగర్వంగా స్వాగతించిన క్షణాలు గుర్తుకొచ్చాయి. మీ సారథ్యంలో ఎంతో మంది క్రీడాకారులు తయారై దేశానికి పేరు తేవాలని కోరుకుంటున్నానని’’ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Must Read ;- ధాబాలో ప్లేట్లు కడిగి.. టోక్యో ఒలింపిక్స్ లో చోటు సాధించి!
దేశంలోనే తొలి క్రీడా విశ్వవిద్యాలయమైన ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి తొలి వైస్ చాన్స్లర్గా నియమితులైన తెలుగు తేజం,ప్రముఖ వెయిట్లిఫ్టర్ పద్మశ్రీ @kmmalleswari గారికి హృదయపూర్వక అభినందనలు.(1/2) pic.twitter.com/0qexWkFIXL
— N Chandrababu Naidu (@ncbn) June 24, 2021










