టీడీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు అక్రమ కేసులు.. అరెస్టులకు పరిమితమైన జగన్ సర్కార్ రౌడీషీట్ తెరిచే పనిలో పనిలో పడింది. బైండోవర్ కేసుల ఉల్లంఘన పేరుతో శ్రీకాకుళం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులపై కోటబొమ్మాలి పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. అచ్చెన్న సోదరుడు, ఆయన కుమారుడు సురేష్, బంధువు కృష్ణమూర్తిపై పోలీసులు రౌడీషీట్ తెరిచారు.
క్రిమినల్ కేసులు
కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామానికి చెందిన కింజరాపు హరివరప్రసాద్, కింజరాపు సురేష్, కింజరాపు కృష్ణమూర్తి, మరికొందరిని పలు కేసుల్లో ప్రధాన నిందితులుగా చేర్చారు. అప్పట్లో టీడీపీ నాయకులు బైండోవర్ అయినప్పటికీ, కేసులను ఉల్లఘించారని, అందుకే రౌడీషీట్ తిరిచామని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు సోదరుడు కింజరాపు హరివరప్రసాద్, ఆయన కుమారుడు కింజరాపు సురేష్, అనుచరుడు కృష్ణమూర్తిపై శ్రీకాకుళం జిల్లా టెక్కలి, కోటబొమ్మాళి పోలీసులు రౌడీషీట్ తెరిచారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండేందుకు వారిపై రౌడీషీట్ తెరిచామని టెక్కలి, కోటబొమ్మాలి పోలీసులు చెబుతున్నారు.
పసలేని ఆరోపణలు
2008 లో ఆంధ్రప్రదేశ్ లో నిమ్మాడలో ఫించన్ల పంపిణీ జరిగింది. కింజారపు గణేశ్ సూచనల మేరకు కార్యక్రమం జరిగింది. అయితే అప్పటి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తమ్ముడు హరివరప్రసాద్, అనుచరుడు కృష్ణమూరి.. తనపై దాడి చేశారని గణేశ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ 354, 323, 506 సెక్షన్లు, ఐపీసీ 34 సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేశారు. వీటితో పాటు మరొకొన్నికేసులు పెట్టారు. 2020లో స్థానిక సంస్థల ఎన్నికల బమ్మిడి లక్ష్మి అనే వైసీపీ అభ్యర్థిని బెదిరించినట్టు.. 2021 స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపించి.. కేసుల పెట్టారు. ఈ వ్యవహరంలో పోలీసులు టీడీపీ నాయకులను టార్గెట్ చేసి.. ప్రభుత్వ పెద్దలకు తలొగ్గి అక్రమ కేసులు పెట్టి రౌడీషీట్ తెరిచారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Must Read ;- అవినీతిపరుల కోసం జగన్ కొత్త పథకం : అచ్చెన్నాయుడు