ప్రముఖ స్ప్రింటర్ మిల్కాసింగ్ (91) కన్నుమూశారు. ఆసియా గేమ్స్లో నాలుగుసార్లు బంగారు పతకాలు సాధించిన ఆయన కొవిడ్ అనంతరం సమస్యలతో చండీగఢ్లోని పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
కరోనా సోకి మే 20న ఆసుపత్రిలో చేరిన మిల్కాసింగ్కు మూడు రోజుల క్రితం నెగటివ్ రావడంతో నాన్ కొవిడ్ ఐసీయూకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా గురువారం రాత్రి పరిస్థితి విషమించి కన్నుమూశారు. మిల్కా సింగ్ భార్య, ఇండియన్ వాలీబాల్ జట్టు మాజీ కెప్టెన్ అయిన నిర్మల్ సైనీ కౌర్ ఈ నెల 13న కరోనాతో కన్ను మూశారు.
20 నవంబరు 1932లో ప్రస్తుతం పాకిస్థాన్లోని పంజాబ్లోని గోవింద్పురలో జన్మించిన మిల్కాసింగ్ పరుగుల పోటీల్లో భారత కీర్తి పతాకను ఎగుర వేశారు. 1958 జాతీయ క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించారు.1958లో కామన్వెల్త్ పోటీల్లో 46.6 సెకన్లలోనే 440 గజాల దూరం పరుగెత్తి భారత్ తరపున తొలి స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారుడిగా రికార్డులకెక్కారు. 1959లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
మిల్కాసింగ్ మృతికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
The passing of sporting icon Milkha Singh fills my heart with grief. The story of his struggles and strength of character will continue to inspire generations of Indians. My deepest condolences to his family members, and countless admirers.
— President of India (@rashtrapatibhvn) June 18, 2021











