కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. భారత్లో సైతం వైరస్ ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. కొవిడ్ ప్రభావం క్రీడలపైనా పడుతోంది.ఈ క్రమంలో పోలెండ్లో జరగబోయే పోటీలకు భారత్ దూరమైంది. అక్కడికి చేరుకునే దారిలేకపోవడంతో భారత మహిళల, పురుషుల అథ్లెట్ల బృందం.. ప్రపంచ రిలే ఛాంపియన్స్ షిప్స్ ఆడలేకపోతోంది. ఫలితంగా ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది.
అథ్లెట్ల ఆశలపై నీళ్లు..
భారత్ అథ్లెట్లకు నిరాశే మిగిలింది. ప్రపంచ అథ్లెట్లిక్స్ రిలే ఛాంపియన్ షిప్స్లో అత్యుత్తమ ప్రదర్శనతో టోక్లో ఒలింపిక్స్కు అర్హత సాధించాలనే మన ఆటగాళ్లకు చేదు అనుభవం ఎదురైంది. స్టార్ అథ్లెట్లు హిమదాస్, ద్యుతి చంద్ ఈసారి పతకాలు తేవడం ఖాయమని అందరూ భావించారు. కానీ చివరికి వాళ్లు అసలు అక్కడికి చేరుకునే పరిస్థితే లేకుండా పోయింది.
భారత్కు నో ఎంట్రీ..
మన అథ్లెట్లు గురువారం తెల్లవారు జామున విమానంలో ఆమ్స్టర్ డామ్కు బయల్దేరాలి. కానీ వైరస్ ఉద్ధృతి కారణంగా భారత్ నుంచి వచ్చే విమానాలను అనుమతించట్లేదని సోమవారం సాయంత్రమే ఆ దేశం ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి పోలెండ్కు నేరుగా విమానం లేకపోవడం వల్ల ఇతర ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రయత్నించిన భారత అథ్లెటిక్స్ సమాఖ్య(ఏఎఫ్ఐ).. చివరకు పోటీల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది.
Mst Read ;- ఐపీఎల్లో ఆడేందుకు క్రికెటర్లు కావలెను..!