2019 ఎన్నికలకు ముందు తిరుమల శ్రీవారికి చెందిన పింక్ డైమండ్ పోయిందని, అది చంద్రబాబునాయుడు కొట్టేశారంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, అప్పటి టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. వారిపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోని టీటీడీ పాలక మండలి వీరిద్దరిపై రూ.200 కోట్లకు పరువునష్టం దావా వేసింది. రూ.2 కోట్లు స్టాంపు ఫీజు చెల్లించాలని తిరుపతి పదో అదనపు జిల్లా జడ్జి కోర్టులో కేసు నమోదైంది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో కేసు ఉపసంహరించుకోవాలంటూ టీటీడీ కోర్టులో విత్ డ్రా పిటిషన్ వేసింది. అయితే కేసును విత్ డ్రా చేసుకోవడానికి వీల్లేదని తెలంగాణకు చెందిన తెలంగాణ హిందూ జనశక్తి పార్టీతో పాటు, గుంటూరుకు చెందిన ఓ న్యాయవాది కూడా ఇంప్లీడ్ పిటీషన్ వేశారు. దీంతో వారిపై కేసు ఉపసంహరించుకునేందుకు కోర్టు నిరాకరించింది.
కేసు ఉపసంహకరణ కుదరదు..
టీటీడీతోపాటు కేసులో మరికొందరు ఇంప్లీడ్ అయ్యేందుకు నేడు కోర్టు అంగీకరించంతో కేసు ఉపసంహరణ కుదరదు. దీంతో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేటి నుంచి ఈ కేసు విచారణ ప్రారంభం కానుంది.
Must Read ;- వేంకటేశ్వరుడి పరువు, సొమ్ము పణంగా పెట్టేస్తారా?