అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీకపూర్ .. అందంలో తల్లికి తగ్గ తనయురాలు అనిపించుకోలేకపోయినా.. అందాలు ఒలికించడంలో మాత్రం అహో.. మహోదయం అని అనిపిస్తోంది. రీల్ లైఫ్ లోనూ, రియల్ లైఫ్ లోనూ ఒకే రేంజ్ లో తన సోయగాలు ఆరబోయడానికి అసలు సంశయించడం లేదు. ప్రస్తుతం ఆమె కథానాయికగా పలు సినిమాలు ప్లానింగ్ లో ఉన్నాయి. ఆమె ఎక్కడికెళ్ళినా ఏం చేస్తున్నా .. మీడియా కళ్ళన్నీ ఆమె వైపే ఉంటున్నాయి.

ప్రస్తుతం జాన్వీకపూర్ .. తన చెల్లెలు ఖుషీ కపూర్ .. బాలీవుడ్ ఎంట్రీ కోసం తెగ తపిస్తోంది. చెల్లెలికి .. బాలీవుడ్ కల్చర్ బాగా అలవాటు చేసింది. అలాగే.. పార్టీలకు, ఫంక్షన్లకు తనతో పాటు తీసుకెళుతూ.. దర్శక, నిర్మాతల చల్లని చూపులు తన చెల్లెలి వైపు ఉండేలా ప్లాన్ చేస్తోంది. దానికి తగ్గట్టుగానే .. ఖుషీ కపూర్ ప్రస్తుతం అమెరికాలో నటనలో శిక్షణ పొందుతోంది. అందులో భాగంగా అక్కడ తన చెల్లెలితో కొంత సమయం స్పెండ్ చేసిన జాన్వీ.. ఆ తర్వాత ఛలో మల్దీవులు అంటూ .. అక్కడికి చెక్కేసింది.

ప్రస్తుతం జాన్వీ కపూర్.. మాల్దీవుల తీరంలో బాగా సేదతీరుతోంది. తన బికినీ అందాలతో సముద్ర తీరంలో జలకాలాడుతోంది. అమ్మడి మాల్దీవుల ఫోటోస్ ప్రస్తుతం ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ గా మారాయి. అండర్ వాటర్ డైవ్ , మరబోటులకు సంబంధించిన ఆ ఫోటోస్ లో జాన్వీ కపూర్ .. అతిలోక సుందరి 2.0 లా కనిపిస్తోంది. మరి ఈ ఫోటోలతో.. అమ్మడికి బాలీవుడ్ లో అవకాశాల శాతం ఇంకా పెరుగుతుందేమో చూడాలి.
Must Read ;- మహేశ్ బాబు సరసన జాన్వీకపూర్.. నిజమేనా?











