ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ఓటమి భయం పట్టుకుందని తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎలెక్షన్ లో వైసీపీ పార్టీకి కొన్ని ఏరియాలలో డిపాజిట్లు కూడా రావని తేలిపోయింది, అందుకే ఈ మధ్య సీఎం జగన్మోహన్ రెడ్డు ఏ పబ్లిక్ మీటింగ్ లో ఐన నోరు పారేసుకుంటున్నాడు . సీఎం జగన్ ఫ్రూస్ట్రేటెడ్ అవడానికి గల కారణాలు యెంతఅని ఆరా తీస్తే అసలు విషయం బయటపడ్డది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ మధ్య రెండు బహిరంగ సభల్లో ప్రసంగించారు. రెండూ ప్రభుత్వ కార్యక్రమాలే అయినా రెండు సమావేశాల్లోనూ సీఎం రాజకీయ మూడ్ లో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
మొన్న నరసరావుపేటలో వాలంటీర్లను సన్మానించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ..ప్రతిపక్షం నాయకులను ఉద్దేశిస్తూ , వలందరు దొంగలు, వెన్నుపోటుదారులు, రాక్షసులు, మనుషులకంటే హీనం అని ముఖ్యమంత్రి మాట్లాడుతున్న భాషపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయన నిర్వహిస్తున్న పదవీ ప్రతిష్టకు అది సరికాదని అభిప్రాయపడ్డారు.
ఇదంతా ఒక ఎత్తైతే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న దానికిసమాధానం చెప్పకుండా , ఒక సీఎం హోదాలో ఉంది వ్యక్తిగత దూషణలకు దిగడం ఆంధ్ర ప్రజలని ఆశ్యర్యానికి గురిచేసింది. వైసీపీలో ఏ ఒక్క నాయకుడు కూడా పద్ధతి మాట్లాడటం ల్లేదని ప్రజలకి తెలిసిపోయింది. ఆ పార్టీ అధ్యక్షుడే బూతులు మాట్లాడుతుంటే కింది స్థాయి నాయకులు అంతకు మించి మాట్లాడుతారని తెలిసిందే.
సీఎం జగన్ ఫ్రూస్ట్రేటెడ్ అవడానికి గల కారణంమరొకటి కూడా ఉంది అదే టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర. నారా లోకేష్ జగన్కి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడని సమాచారం. అలాగే ఆంధ్రాలో టీడీపీ బలం రోజు ర్రోజుకి పెడుతూండటం, లోకేష్ కి ఆంధ్ర ప్రజలు బ్రహ్మ రథం పడుతుండటంతో జగన్ జీర్ణించుకోవడం లేదని సమాచారం.