సమ్మెకు దిగితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి!
‘చలో విజయవాడ’ సెగ జగన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. శుక్రవారం ఉదయం రాష్ట్ర సచివాలయం ఉద్యోగుల చేసిన పెన్ డౌన్ కార్యక్రమం ఊపిరి ఆగిపోయంతా పనైంది! పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 6 వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె బాట పడుతున్నారన్న వార్తా.. జగన్ రెడ్డికి కంటిమీద కునులేకుండా చేస్తున్నాయి. ఉద్యోగులు చేస్తున్న సహాయ నిరాకరణ నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను వేగవంతం చేసింది. సీఎం ఆదేశాల మేరకు మంత్రులు బొత్స, బుగ్గన, పేర్ని, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ సమీర్ శర్మ, ఆర్థికశాఖ అధికారులు ఉద్యోగ సంఘాలతో అత్యవసర భేటీ నిర్వహించి, చర్చలు జరిపారు. దీంతో హెచ్ఆర్ఏ స్లాబ్ మార్పులకు సంబంధించిన నివేదిక ఇచ్చే అవకాశం ఉందన్నారు. కాగా.. తమకు లిఖితపూర్వక హామీ కావాలని స్టీరింగ్ కమిటీ స్పష్టం చేశారు.
చెప్పేందుకు ఏమీ లేదు..
చర్చలకు పిల్చి, ఇప్పటి వరకు ఉద్యోగులకు ప్రభుత్వం ఒరగపెట్టింది ఏమీ లేదు. ఇప్పటి వరకు తాము చెప్పాల్సింది చెప్పామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. కార్యాచరణ ప్రకటించినందుకు ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదని తెలిపాయి. సమస్యపై సీఎం ఆలోచిస్తున్నారని స్టీరింగ్ కమిటీ సభ్యులకు మంత్రులు వివరించారు. కొత్త పీఆర్సీ పై ఇచ్చిన జీవోలను రద్దు, తగ్గించిన హెచ్ఆర్ఏ యథాతథంగా కొనసాగింపు, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు మంత్రులను కోరారు.











