న్యాయం కోసం ఢిల్లీలో దేహి అంటున్న ‘వైసీసీ నాయకుడు’
ఏపీలో జగన్ రెడ్డి ప్రభుత్వంలో నా కుటుంబానికి న్యాయం జరగడంలేదని, మరోవైపు ప్రాణహాని కూడా ఉందని ప్రకాశం జిల్లా ఒంగోలు కు చెందిన అధికార పార్టీ సీనియర్ నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా ఆరోపించారు. కేంద్ర మంత్రి అమిత్ షా తప్ప తనకు న్యాయం జరగదని భావించిన సుబ్బారావు గుప్తా.. ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయిట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల తనపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడు దాడి చేసి ఘటనపై కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వచ్చానని ఆయన చెప్పారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో నాకు, నా కుటుంబానికి రక్షణ దొరకదని, రక్షణ కలపించాలంటూ హోం శాఖ మంత్రికి లేఖ రాస్తానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పోలీసులు న్యాయం చేయడం లేదని, బాలినేని పథకం ప్రకారమే నాపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. మంత్రి పదవీ నుంచి బాలినేని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కలిపించాలంటూ నిన్న జంతర్మంతర్ లో సుబ్బారావు నిరసన తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా అధికారపార్టీలో అసంతృప్తి జ్వాలలు
రాష్ట్ర వ్యాప్తంగా అధికారపార్టీ కేడర్ లో అసంతృప్తి జ్వాలలు రోజురోజుకు ఎక్కడో ఒకచోట బహిర్గతమౌతూనే ఉన్నాయి! శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు అధికార పార్టీలో రెండు వర్గాలు చీలి, కొట్టుకుంటున్నారు. ఆదిపత్యపోరు, అసంతృప్తితో కామెంట్ చేస్తే వారిపై సాగించే కక్ష సాధింపు చర్యలు నెక్స్ట్ లెవల్ అన్నట్లు ఉంటున్నాయి. సొంతపార్టీ నేతలను అని కూడా చూడకుండా కేసులు పెట్టి వేధించడం, దాడులకు తెగబడతం అన్నది అధికారపార్టీ సాంప్రదాయంగా పెట్టున్నారు. ‘‘చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా, అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు’’ ఇలా చెప్పుకుంటూపోతే అధికార వైసీపీ ఎమ్మెల్యేలకు, కేడర్ కు మధ్య అంతరాలు ఒక్కసారిగా బయటపడి.. భగ్గుమంటున్నాయి. చివరికి కేసులు పెట్టి మరి సొంతపార్టీ నాయకులను, ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే వేధించిన ఘటనలు విదితమే!